టాలీవుడ్ లో యాంకర్ అయిన చాలా రోజుల తర్వాత సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్న యాంకర్ అనసూయ. ప్రస్తుతం ఆమెకు టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంది. బుల్లితెర యాంకర్ గానే కాకుండా కొన్ని కీలక పాత్రల కోసం సినిమాల్లో ఆమెను సంప్రదిస్తున్నారు దర్శకులు. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో ఆమె రంగమ్మ అత్త పాత్రలో నటించి మెప్పించింది. ఆ సినిమాలో ఆమె పాత్ర హైలెట్ గా నిలిచింది. అనసూయ గ్లామర్ కి మినహా నటనకు పనికి రాదు అని వెక్కిరించిన ఎందరికో ఆమె సమాధానం చెప్పేసింది. 

 

ఇప్పుడు ఆమె యాంకర్ గానే కాకుండా నటిగా పూర్తి స్థాయిలో బిజీ అవ్వాలని చూస్తుంది. దీనితో దర్శకులు కూడా ఆమె కు కీలక పాత్రలు ఇవ్వడానికి సిద్దమవుతున్నారు. తాజాగా నితిన్ సినిమాలో ఒక పాత్ర కోసం ఆమెను సంప్రదించే యోచనలో ఉన్నారు ఒక దర్శకుడు. విలన్ పాత్ర కోసం ఆమెను సంప్రదించారు అంటున్నారు. అయితే ఆ పాత్రకు అనసూయ సరిపోతుందా లేదా అనే ఆలోచనలో పడిపోయాడు దర్శకుడు. ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. విలన్ గా ఆమె నటన ఎలా ఉంటుంది అనేది కూడా ఆలోచిస్తున్నారు. 

 

ఇప్పటి వరకు అనసూయ అంటే సాఫ్ట్ క్యారెక్టర్స్ మాత్రమే చేస్తుంది అనే నమ్మే వారు. ఇప్పుడు ఒక్కసారిగా ఆమెకు ఆ పాత్ర ఇస్తే ఏ విధంగా ఉంటుంది అనేది దర్శకుడు ఆలోచనలో పడిపోయారు. అలాగే మహేష్, వంశీ పైడపల్లి కాంబినేషన్ లో వచ్చే సినిమా కోసం కూడా అనసూయ పేరుని పరిశీలిస్తున్నారు. ఈ సినిమా త్వరలో షూటింగ్ కి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఆమెకు ఎలాంటి పాత్ర వస్తుంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. కొన్ని పాత్రలకు ఆమె సరిపోవడం, కొన్ని పాత్రల విషయంలో సందేహాలు ఉండటంతో ఇప్పుడు చాలా మంది దర్శకులు ఆలోచించి ఆలోచించి వదిలేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: