బాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సినిమాల్లో బ్రహ్మాస్త్ర ఒకటి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది క్రిస్మస్ కి ప్రేక్షకుల ముందుకి రానుంది. కనీవినీ ఎరుగని రీతిలో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఎక్కడా కూడా రాజీ పడకుండా సినిమాను నిర్మిస్తున్నారు. ఖర్చు విషయంలో వెనుకాడటం లేదు. ఇక ఈ సినిమాకు ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ నటులు చాలా మంది నటిస్తున్నారు కూడా. 

 

అమితాబ్ బచ్చన్, మౌనీ రాయ్, డింపుల్ కపాడియా, షారుక్‌ ఖాన్‌తో పాటు టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా గురించి ఏ వార్త వచ్చినా సరే బాలీవుడ్ ఆసక్తిగా చూస్తుంది. ఈ క్రమంలోనే ఒక వార్త వచ్చింది. గతంలో ప్రేమించుకుని పెళ్లి వరకు వెళ్ళిన ఒక హీరో హీరోయిన్ గురించి. వాళ్ళ గురించి వచ్చిన ఈ వార్తకు బాలీవుడ్ జనాలు కూడా షాక్ అవుతున్నారు. వాళ్ళే బాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు రణ్‌బీర్ కపూర్, దీపిక పదుకొణె. వీరిద్దరూ ఒకప్పుడు దారుణంగా ప్రేమించుకున్నారు కూడా. 

 

కలిసి కొన్ని సినిమాలు కూడా చేసారు. విడిపోయిన తర్వాత కూడా తమాషా అనే సినిమాలో నటించారు. ఇప్పుడు దీపిక పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వగా రణబీర్ కపూర్ ఆలియా బట్ తో ప్రేమలో ఉన్నాడు. అలాంటిది హీరోకు తల్లిగా నటించాలని అతని దీపిక పదుకొనే ని అడిగారట. బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీది. అయాన్ డైరెక్షన్‌లో రణ్‌బీర్, ఆలియా జంటగా ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్‌కు తల్లిదండ్రులుగా రియల్ లైఫ్ కపుల్ దీపిక పదుకొణె, రణ్‌వీర్ సింగ్‌లు నటించాలని అడిగారట. ఇందుకు వాళ్ళు ఇద్దరు అసలు ససేమీరా అన్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: