సినీరంగంలో సంచలనం సృష్టించిన ప్రేమకథలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఓ ప్రేమకథే శింబు, నయనతారలది. కెరీర్ స్టార్టింగ్లోనే కోలీవుడ్ ప్లే బాయ్ శింబుతో ప్రేమలో పడిన నయనతార, అతనితో చెట్టాపట్టాలేసుకొని తిరిగింది. అప్పట్లో వాళ్లిద్దరి ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే అనుహ్యా పరిణామాల మధ్య వీరిద్దరూ విడిపోయారు. అంతేకాదు బ్రేకప్ తరువాత శింబుపై సంచలన కామెంట్స్ చేసింది నయనతార. శింబు కారణంగా తన జీవితంలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పింది.
అయితే నయనతారతో బ్రేకప్ తరువాత శింబు కూడా డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఎంతో గాఢంగా ప్రేమించిన ప్రియురాలు దూరమై ఒంటరితనాన్ని బరించలేక మానసికంగా క్రుంగిపోయాడు. ఈ ప్రభావం శింబు కెరీర్ మీద కూడా పడింది. షూటింగ్లకు ఆలస్యంగా వస్తాడన్న పేరున్న శింబు, నయన్తో బ్రేకప్ నిర్మాతలను మరింతగా ఇబ్బంది పెట్టాడు. కాల్షిట్ల ప్రకారం షూటింగ్లకు హాజరు కాకపోవటం, వచ్చినా ఆలస్యంగా రావటం పనిమీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం లాంటి ఇబ్బందులతో కెరీర్ను పాడు చేసుకున్నాడు. దీంతో స్టార్ హీరోగా నెంబర్ వన్ పొజిషన్కు పోటి పడ్డ శింబు ఒక్కసారిగా వెనకపడిపోయాడు.
శింబు తిరిగికోలుకోవడానికి చాలా ఏళ్లు పట్టింది. ఈ మధ్యే తిరిగి ఫాంలోకి వచ్చినట్టుగా కనిపిస్తున్న శింబు, బ్రేకప్ తరువాత చాలా ఏళ్లకు తిరిగి నయనతారతో నటించాండు. పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సరసుడు సినిమాలో నయనతార, శింబులు కలిసి నటించారు. తమ గతాన్ని పూర్తిగా మర్చిపోయి ఈ సినిమాలో ప్రొఫెషనల్గా నటించి మెప్పించారు. అయితే కెరీర్ స్టార్టింగ్లో చేసిన ఘాటు రొమాన్స్ కాకుండా మెచ్యూర్డ్ లవ్ స్టోరిలో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరు ఎవరి కెరీర్లో వారు బిజీ బిజీగా ఉన్నారు. అయితే ఇప్పటికీ సౌత్ లో సినీ తారల లవ్ ఎఫైర్స్కు సంబంధించిన వార్తలు వస్తే ఈ వీరి పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి.