‘భీష్మ’ మూవీ టోటల్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఈ మూవీ కలక్షన్స్ అనూహ్యంగా నిన్నటి రోజున డ్రాప్ కావడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. వాస్తవానికి ఈ మూవీకి వచ్చిన హిట్ టాక్ రేంజ్ లో నిన్నటి రోజు కలక్షన్స్ లేవు అని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. 

 

మరికొందరైతే ఈ మూవీని ఈ పరీక్షల సీజన్ లో కాకుండా సమ్మర్ సీజన్ లో విడుదల చేసి ఉంటే మరింత మంచి కలక్షన్స్ వచ్చి ఉండేవని అభిప్రాయ పడుతున్నారు. ఈ పరిస్థితులలో ఈ మూవీ సక్సస్ మీట్ లో హీరో నితిన్ దర్శకుడు వెంకీ కుడుముల పై ప్రశంసలు కురిపిస్తూ మధ్యలో చేసిన కామెంట్స్ హీరో నాగశౌర్య ను ఉద్దేశించినవి అన్న ప్రచారం జరుగుతోంది. 

 

‘ఈ మూవీ ఘన విజయంతో మీరు అనేకమందికి సమాధానం ఇచ్చారు. ఇంతకీ ఈ స్క్రిప్ట్ మీరే వ్రాసారా’ అంటూ జోక్ చేసాడు. దీనితో నితిన్ అన్న మాటలు నాగశౌర్య ను టార్గెట్ చేసేవిగా ఉన్నాయి అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గతంలో వెంకీ కుడుముల నాగశౌర్యల కాంబినేషన్ లో వచ్చిన ‘ఛలో’ మూవీ కథ తానే వ్రాశాను అంటూ నాగశౌర్య ఈమధ్య ‘అశ్వథ్థామ’ మూవీ ప్రమోషన్ లో చెప్పిన విషయానికి సమాధానంగా నితిన్ ఇలా నాగశౌర్య ను కామెంట్ చేసి ఉంటాడు అంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

 

హీరోయిన్ రష్మిక కూడ ‘ఛలో’ మూవీకి సంబంధించిన ఒక ప్రమోషన్ ఇంటర్వ్యూలో వెంకీ కుడుములతో మాట్లాడుతూ ‘ఈ కథను మీరే వ్రాసారా’ అంటూ గతంలో జోక్ చేసింది. ఇప్పుడు మళ్ళీ నితిన్ కూడ అదే ప్రస్తావన తీసుకు రావడంతో వెంకీ కుడుముల తరఫున ఇలా నితిన్ నాగశౌర్య కు సమాధానం ఇచ్చి ఉంటాడు అంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉంటే నాగశౌర్య అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ఇప్పటికే మొదలు పెట్టిన మూవీ ఆగిపోయింది అన్న ప్రచారం జరగడం బట్టి ప్రస్తుతం నాగశౌర్య పరిస్థితి ఏమిటో అర్ధం అవుతుంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: