సాధారణంగా ఒక టాప్ డైరెక్టర్ చెప్పిన కథను ఒక టాప్ హీరో ఒప్పుకోకపోతే వెంటనే ఆ టాప్ డైరెక్టర్ తన మాటల గారడీతో మరో టాప్ హీరోను బుట్టలో పడేసి తన కథలో నటించడానికి ఒప్పిస్తూ ఉంటాడు. అయితే స్వతహాగా మృదు స్వభావిగా పేరు గాంచిన వంశీ పైడిపల్లి తనకు చివరి నిముషంలో మహేష్ నుండి వచ్చిన పరాభవం జీర్ణించుకోలేకపోతున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. 

 

‘మహర్షి’ మూవీ విడుదల తరువాత వంశీ పైడిపల్లి మహేష్ ల సాన్నిహిత్యం విపరీతంగా పెరిగిపాయింది. మహేష్ ఆ మధ్య లండన్ లో ఉంటే అతడు ఇండియాలో ఉన్న వంశీకి ఫోన్ చేసి అతడిని భార్య పిల్లలతో రప్పించి తన లండన్ ట్రిప్ ను ఎంజాయ్ చేసాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ ప్రమోషన్ సమయంలో కూడ మహేష్ కూతురు వంశీ పైడిపల్లి కూతరు కలిసి ఆ మూవీని ప్రమోట్ చేస్తూ ఒక వీడియోను కూడ విడుదల చేసారు. 


దీనితో ఇలాంటి సాన్నిహిత్యం తనకు ఉన్నప్పటికీ తనకు మరొక కథను వ్రాసే అవకాశం ఇవ్వకుండా మహేష్ మూవీ క్యాన్సిల్ కావడం వంశీ పైడిపల్లికి ఊహించని షాక్ గా మారింది అని అంటున్నారు. దీనికితోడు ఈవార్త మహేష్ పిఆర్ టీమ్ ద్వారా లీక్ అవ్వడం వంశీకి మరో ఊహించని షాక్ అన్న ప్రచారం జరుగుతోంది. 


వాస్తవానికి గతంలో సుకుమార్ కు కూడ ఇలాంటి పరాభవం మహేష్ కు ఎదురైనా వెంటనే ఎలర్ట్ అయి అల్లు అర్జున్ ను లైన్ లో పెట్టుకోగలిగాడు. అయితే ఇప్పుడు టాప్ హీరోలు ఎవరు ఖాళీగా లేకపోవడంతో పాటు వంశీ పైడిపల్లికి చాలామంది టాప్ హీరోలతో పెద్దగా సాన్నిహిత్యం లేకపోవడం కూడ ఇప్పుడు అతడికి ఒక మైనస్ పాయింట్ గా మారింది అని అంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు వంశీ పైడిపల్లి పరిస్థితి ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలు వంశీ పైడిపల్లి పరిస్థితి పై సానుభూతి చూపెడుతున్నారు..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: