ఈ మధ్య టాలీవుడ్ హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు మార్కెట్ భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఆయన సినిమాలు అన్నీ కూడా భారీగా వసూళ్లు చేస్తున్నాయి. మహేష్ బాబు సినిమా విడుదల అవుతుంది అంటే చాలు ఫాన్స్ లో కూడా క్రేజ్ ఒక స్థాయిలో ఉంటుంది అనే విషయం అందరికి తెలిసిందే. ఇక మహేష్ కూడా కాస్త కమర్షియల్ గా ఆలోచించడం మొదలుపెట్టారు. ఆయన సినిమాలకు భారీగా వసూళ్లు ఉన్న నేపధ్యంలో పారితోషకం కూడా అదే రేంజ్ లో తీసుకోవాలని భావించారు మహేష్ బాబు. 

 

అంత వరకు బాగానే ఉంది గాని ఆయన సినిమాల విషయంలో ప్రధానంగా నమ్రత అనవసర పెత్తనం చేలాయిస్తున్నారు అనే టాక్ ఎక్కువగా వినపడుతుంది. ముఖ్యంగా నమ్రత గత కొన్నాళ్ళు గా ఆయన సినిమా వ్యవహారాలు దగ్గర ఉండి చూస్తున్నారు. ప్రతీ సినిమాను ఆమె పర్యవేక్షిస్తూ బడ్జెట్ నుంచి ప్రతీ ఒక్కటి తెలుసుకుంటున్నారు. ఇక సినిమాలకు ఈ మధ్య మహేష్ నిర్మాతగా కూడా మారిన సంగతి తెలిసిందే. దీనితో ఆయన సినిమాలు అన్నీ కూడా నమ్రత చేతుల మీదుగానే మార్కెట్ జరుగుతుంది. 

 

ఇప్పుడు ఇదే నిర్మాతలకు చుక్కలు చూపిస్తుంది అంటున్నారు పలువురు. ఆమె అనవసరంగా కొన్ని షరతులు పెట్టడం, వాటికి లోబడి నిర్మాతలు ఉండాలీ అనడం, సినిమా విడుదలకు ముందు మార్కెట్ అంతా తమకే అంటూ ఆమె స్పష్టంగా చెప్పడం వంటివి నిర్మాతలకు చికాకు తెప్పిస్తున్నాయి. సీనియర్ నిర్మాతలు కూడా హీరో ఖర్చు విషయంలో ఆమె పెట్టే షరతులు చూసి భయపడే పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇప్పుడు మహేష్ తో సినిమా చెయ్యాలి అంటే భయపడుతున్నారట. దిల్ రాజు కూడా ఒకానొక సందర్భంలో ఆమె పెట్టే షరతులు చూసి భయపడ్డారట. మహేష్ జోక్యం చేసుకున్నా ఫలితం ఉండటం లేదని నిర్మాతలు వాపోవడం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: