ఈ మధ్య అభిమానులకు, ప్రేక్షకులకు కొత్తదనం ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు హీరోలు. టాలీవుడ్ లో ముఖ్యంగా ఈ ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గతంలో ఈ ట్రెండ్ మనం బాలీవుడ్ లోనే చూసే వాళ్ళం. అయితే ఇప్పుడు ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్న నేపధ్యంలో హీరోలు నటనలో వైవిధ్యం చూపించడానికి సిద్దమవుతున్నారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటులు ఈ విషయంలో కాస్త అందరి హీరోలకు ఆదర్శంగా నిలుస్తూ వస్తున్నారు.

 

తాజాగా అల్లు అర్జున్ కూడా అదే బాటలో నడుస్తున్నారు. అల వైకుంఠపురములో సినిమా తో మంచి జోష్ లో ఉన్నాడు ఈ హీరో. తర్వాత సుకుమార్ తో ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి లో ప్రేక్షకుల ముందుకి రానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం ఇప్పుడు తీవ్రం గా కష్టపడుతున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమాను రంగస్థలం తరహాలో విభిన్నంగా తెరకెక్కించాలని సుకుమార్ భావిస్తున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ అనే అంశం చుట్టూ సాగే ఈ సినిమా లో చిత్తూరు యాస అనేది కీలకం అని భావిస్తున్నాడట.

 

ప్రేక్షకులు కూడా సినిమా లో కొత్తదనం కోరుకుంటున్నారు కాబట్టి ఆ విధంగానే ముందుకి వెళ్తున్నాడు. ఇక సినిమా న్యాచురల్ గా ఉండాలి అంటే, యాస ఉండాలని భావిస్తున్నాడు అల్లు అర్జున్. ఇప్పటికే యాస ఏ విధంగా ఉండాలి అనే దానిపై తన సన్నిహితుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే కొందరి సలహాలను కూడా యాస కోసం అడిగినట్టు సమాచారం. త్వరలోనే ఇందుకోసం చిత్తూరు కూడా వెళ్ళే ఆలోచనలో ఉన్నాడట ఈ మెగా హీరో. ఇక సుకుమార్ కూడా కథ ఏ విధంగా ఉంటుందో చెప్పడంతో ఆ విధంగా కష్టపడుతున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమాతో పాటుగా మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: