తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని.. ఇక్కడ చాలా మంది దళారులు అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారని పెద్ద ఎత్తున గొడవ చేసి పలు యూట్యూబ్ ఛానల్స్ లో రచ్చ చేసిన శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  తనకు మా అసోసియేషన్ వారు కార్డు ఇవ్వలేదని ఫిలిమ్ ఛాంబర్ ముందు అర్థనగ్న ప్రదర్శన చేసి ఏకంగా జాతీయ మీడియాలోకి ఎక్కింది.  ఏ విషయం అయినా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే  శ్రీరెడ్డి నోటిదురుసు ఎక్కువ అంటారు.  ఆమె మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పోస్ట్ ఏదో ఒక కాంట్రవర్సీ ఉంటూనే ఉంది.  గతంలో పవన్ కళ్యాన్ పై చేసిన ఆమె కామెంట్స్ ఎంత రచ్చచేశాయో తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. 

 

దాతో ఆమెపై ఫ్యాన్స్ ట్రోలింగ్ చేయడం తో చెన్నైకి వెళ్లిపోయింది.  అక్కడ నుంచి సెలబ్రెటీలపై కామెంట్స్ చేస్తూ వచ్చింది.  ఈ నేపథ్యంలో నటి కరాటే కళ్యాణి, డ్యాన్స్ మాస్టర్ రాకేష్ లను బండ బూతులు తిడుతూ ఓ పోస్ట్ చేసింది.  దాంతో ఆమెపై వీరిద్దరూ పోలీసు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరాటే కల్యాణి, డ్యాన్స్ మాస్టర్ రాకేశ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని నటి శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేసింది.

 

ఈ మేరకు చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. అంతే కాదు తనను చంపేస్తామని.. తన కారు పై పెట్రోల్ పోసి నిప్పంటిస్తామని హెచ్చరికలు వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది.  కల్యాణి, డ్యాన్స్ మాస్టర్ రాకేశ్ ఇటీవల హైదరాబాద్ క్రైం బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి వీరిద్దరిపై కేసు పెట్టడం గమనార్హం. మరి ఈ వివాదం ముందు ముందు ఏ రేంజ్ లో కొనసాగుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: