‘గీత గోవిందం’ సూపర్ సక్సస్ తరువాత పరుశు రామ్ కు వరస పెట్టి అవకాశాలు వస్తాయని అందరు భావించారు. అయితే అవకాశాలు రాకపోవడంతో కొంత కాలం వేచి చూసి ఇక లాభం లేదనుకుని పరుశు రామ్ తానే టాప్ హీరోలను కలుస్తూ మహేష్ ప్రభాస్ అల్లు అర్జున్ లకు కథలు వినిపించాడు. 


వీరంతా పరుశు రామ్ కథలు బాగున్నాయి అని చెప్పారు కాని ఎవరు అవకాశాలు ఇవ్వలేదు. దీనితో విసిగిపోయిన పరుశు రామ్ కనీసం అఖిల్ తో అయినా సినిమా చేద్దాం అనుకున్నాడు. అయితే అక్కడ కూడ ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఊహించని విధంగా పరుశు రామ్ చెప్పిన కథకు చైతన్య ఓకె చేయడమే కాకుండా ఈ మూవీని నిర్మిస్తున్న నిర్మాతల చేత పరుశు రామ్ కు అడ్వాన్స్ ఇప్పించి ఎగ్రిమెంట్ పై సంతకాలు కూడ చేయించాడట. 


అయితే ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకే మహేష్ వంశీ పైడి పల్లిల మూవీ క్యాన్సిల్ కావడంతో మహేష్ నుండి పరుశు రామ్ కు పిలుపు రావడం అదేవిధంగా చిరంజీవి నటించాలి అని భావిస్తున్న ‘లూసిఫర్’ రీమేక్ కు అవకాశం రావడం ఒకేసారి జరిగినట్లు టాక్. దీనితో ఆనందం పట్టలేక పరుశు రామ్ నాగచైతన్య మూవీని పక్కకు పెడదామని భావిస్తే ఆ మూవీ నిర్మాతలు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది.


దీనితో ఎవరు అవకాశాలు ఇవ్వనప్పుడు అవకాశం ఇచ్చిన చైతన్య తనకు అదృష్టమా లేదంటే మహేష్ చిరంజీవి లాంటి బడా స్టార్స్ అవకాశాలు ఇచ్చినా చైతన్య కారణంగా పోగొట్టుకున్న పరిస్థితులలో చైతూ తనకు దురదృష్టమా అన్న విషయం తేల్చుకోలేక అంతర్మధనంలో పరుశు రామ్ ప్రస్తుతం ఉన్నట్లు టాక్. దీనితో ‘గీత గోవిందం’ లాంటి భారీ హిట్ ఇచ్చిన ఈ డైరెక్టర్ కు అదృష్టం తలుపు తట్టినా ఉపయోగించుకోలేని స్థితిని చూసి ఇండస్ట్రీలోని చాలామంది పరుశు రామ్ పరిస్థితి పై సానుభూతి చూపిస్తున్నారు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: