ఈ మద్య టెక్నాలజీ వచ్చినప్పటి మంచి కన్నా చెడు ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ సినీ నటి పిజ్జా కోసం ఆర్డర్ చేస్తే ఆ దుర్మార్గుడు సినీ నటి నెంబర్ అని తెలిసి ఫోర్న్ సైట్లో షేర్ చేశాడు. వివరాల్లోకి వెళితే తమిళ నటి గాయత్రి సాయి బుధవారం డోమినోస్ పిజ్జా డెలివరీ బాయ్పై పోలీసులకి ఫిర్యాదు చేశారు. తన ఫోన్ నెంబర్ ని అసభ్యకర గ్రూప్లలో పోస్ట్ చేసి తనపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయాన్ని ఆమె తన పోస్ట్ ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంది.
ఈనెల 9న చెన్నైలోని తన ఇంటికి డోమినోస్ డెలివరీ బాయ్ పిజ్జా తీసుకుని వచ్చాడని గాయత్రి సాయి తెలిపారు. అనంతరం అతడు తన ఫోన్ నెంబర్ను అడల్ట్ గ్రూప్స్లో షేర్ చేశాడని చెప్పారు. దీంతో విపరీతమైన ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయని గాయత్రి వాపోయారు. తనకు ఇదివరకు ఇలాంటి కాల్స్ ఎప్పుడూ రాలేదే.. పిజ్జా ఆర్డర్ చేసిన తర్వాత ఇలా వరుస పెట్టి కాల్స్ వస్తున్నాయని అసలు దీని వెనుక రహస్యం ఏంటా అని ఆలోచించడం మొదలు పెట్టింది. ఫోన్ కాల్స్తో విసుగెత్తిన ఆమె... తనకు సాయం చేయాల్సిందిగా తమిళనాడు పోలీసులను కోరారు.
తన నెంబర్ ఇతరులకు షేర్ చేయకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే వాట్సాప్ మెసేజ్లను కూడా ఆపించాలని అన్నారు. అంతే కాదు పిజ్జా డెలివరి బాయ్ నెంబర్ పోలీసులకు పంపించింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు పిజ్జా డెలివరి బాయ్ ని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారణ చేస్తే నిజం చెప్పాడు. నటి గాయత్రి సాయి... ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన అంజలి చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీకి పరిచమయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో ఆమె నటించారు.