సినీతారల పెళ్లి వార్తలు ఎప్పుడు మీడియాలో హల్చల్ చేస్తుంటాయి. అధికారక ప్రకటనలకన్నా ముందే వారి పెళ్లి వార్తలు లెక్కకు మించి సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. సౌత్ లో సెన్సేషనల్ స్టార్గా పేరు తెచ్చుకున్న విశాల్ పెళ్లి కూడా కొద్ది సంవత్సరాలుగా తెగ వార్తల్లో నానింది. చాలా రోజులుగా పాటు తన బద్ధ శత్రువు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీని పెళ్లిచేసుకోబోతున్నాడన్న ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ ఓ హైదరాబాద్ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు విశాల్.
అయితే ఆ నిశ్చితార్థం కూడా క్యాన్సిల్ అయినట్టుగా కోలీవుడ్ మీడియా తెగ వార్తలు రాసేసింది. అయితే ఆ వార్తలపై సస్పెన్స్కు త్వరలోనే తెరపడునుందని తెలుస్తోంది. గత ఏడాది మార్చిలో అనీషా అనే అమ్మాయితో విశాల్ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్లో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. అయితే నడిఘర్ సంఘం భవనం పూర్తయిన తరువాత ఆ భవనంలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న విశాల్ పెళ్లి డేట్ను నిశ్చితార్థం రోజు ప్రకటించలేదు.
అయితే వివాహం ఆలస్యం కావటంతో విశాల్, అనీషలు నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్నట్టుగా వార్తలు వినిపించాయి. అనీషా తన సోషల్ మీడియా పేజ్ల నుంచి ఎంగేజ్మెంట్ ఫోటోలు తీసి వేయటంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరినట్టైంది. మీడియా, అభిమానులు అంతా విశాల్ పెళ్లి ఆగిపోయిందా?.. అన్న అనుమానాలు వ్యక్తం చేసినా, విశాల్ మాత్రం ఎలాంటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు.
కొద్ది రోజుల తర్వతా ఈ వార్తలపై స్పందించిన విశాల్ తండ్రి, త్వరలోనే అనీషా, విశాల్ ల పెళ్లి డేట్ను ప్రకటిస్తానని చెప్పాడు. కానీ ఇంతవరకు పెళ్లి డేట్ మాత్రం ప్రకటించలేదు. దీంతో ఇప్పటికీ ఆ వార్త రూమరా లేక నిజంగానే విశాల్ నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్నాడా అన్న డైలామాలో ఉన్నారు విశాల్.