ఇటీవల మన్మథుడు 2 సినిమాతో దారుణంగా నిరాశపరిచిన సీనియర్ హీరో నాగార్జున కొంత గ్యాప్ తరువాత ఓ యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మన్మథుడు 2 సినిమాలో కాస్త అడల్డ్ డోస్ ఎక్కువ కావటంతో నాగ్ పై విమర్శలు వినిపించాయి. దీంతో నెక్స్ సినిమా విషయంలో జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటున్నాడు. అందుకే సీరియస్ మోడ్ లో సాగే వైల్డ్ డాగ్ సినిమాను ఎంచుకున్నాడు.
ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇటీవల కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఆలస్యమవుతోంది. నాగ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా నటిస్తున్న ఈ సినిమాతో సల్మాన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. బాలీవుడ్ హాట్ బ్యూటీలు దియా మీర్జా, సయామీ ఖేర్ లు హీరోయలుగా నటిస్తున్నారు.
అయితే ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా హైదరాబాద్ లో జరిగిన జంట పేలుళ్ల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. 2007లో హైదరాబాద్ లుంబినీ పార్క్, గోకుల్ ఛాట్ లలో జరిగిన జంట పేలుళ్ల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల లుంబినీ పార్క్ లో నాగార్జునతో పాటు ఇతర కీలక పాత్రదారులపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో ప్రస్టీజియస్ గా తెరకెక్కుతున్న బ్రహ్మాస్త్ర సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు నాగ్. రణబీర్ కపూర్, అలియా భట్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ ఫాంటసీ డ్రామాలో అమితాబ్ బచ్చన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న బంగార్రాజు సినిమాను త్వరలో సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు నాగ్.