టాలీవుడ్ రారాజు చిరంజీవి ఈ మధ్య ప్రతి రోజు వార్తల్లో నిలుస్తున్నారు. దానికి పెద్ద కారణమే వుంది. సేవ్ అమరావతి పేరిట jac చేస్తున్న ధర్నాకు చిరంజీవి గారు మద్దతు ప్రకటించ లేదని సదరు నాయకులు మన మెగాస్టార్ మీద గుర్రుగా వున్నారు. ఇలాంటి సందర్భంలో... ఆయన ఇంటిని ముట్టడించడానికి జేఏసీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్‌లోని మెగాస్టార్‌ చిరంజీవి ఇంటి ముందు ధర్నాకు పిలుపునిచ్చారు అమరావతి పరిరక్షణ జేఏసీ నాయకులు. 

 

రైతుల గోడు చిరంజీవికి పట్టడం లేదని, వారు ఆయన ఇంటిని ముట్టడించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి దగ్గర పోలీసులు కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే చిరంజీవి మీద ఈగ కూడా వాలనివ్వమంటూ అయన అభిమానులు ఆయన ఇంటి దగ్గర కాపలా కాస్తున్నారు. రాష్ట్రం నలువైపుల నుంచి వచ్చిన చిరు సేన ఆయన ఇంటి దగ్గర పాగా వేసింది.పోలీసులు కూడా మెగాస్టార్ ఇంటి దగ్గర ఎవ్వర్నీ రానీకుండా బారీకేడ్లను ఏర్పాటు చేశారు. 

 

ఇదిలా ఉంటే ఈ ధర్నాతో తమకు ఎలాంటి సంబంధం లేదని అమరావతి జేఏసీ ప్రకటించడం కొసమెరుపు. ఇదిలా ఉంటే తమ అభిమాన హీరో చిరంజీవి ఇంటిని ముట్టడిస్తే చూస్తూ ఊరుకోరంటూ వార్నింగ్ ఇస్తున్నారు చిరంజీవి ఫాన్స్. చిరు ఫ్యాన్స్ అసోషియేషన్ అధ్యక్షుడు స్వామి నాయుడు కూడా అక్కడే ఉన్నాడు. రాజకీయాల ముసుగులో రాముడి లాంటి మన చిరంజీవి అన్నయ్యపై జరుగుతున్న కుట్రను ఎదుర్కోవాలంటూ వాళ్లు పిలుపునిస్తున్నారు. 

 

రండి.. రండి.. కదిలిరండి.. మెగాస్టార్ చిరంజీవి అన్నయ్యకు రక్షణగా ఉందామంటూ స్వామి నాయుడు పిలుస్తున్నాడు. ఫిబ్రవరి 29న చిరు ఇంటికి వచ్చి ఆయన సత్తా ఏంటో చూపిద్దామంటూ వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. చిరంజీవి జోలికొస్తే చూస్తూ ఊరుకోం.. తోలు తీస్తామంటూ వార్నింగ్స్ ఇస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా పరిస్థితులను పూర్తిగా తమ అదుపులోకి తీసుకొని చిరంజీవి ఇంటికి రక్షణగా వున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: