వారం రోజుల క్రితం నుంచీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన అంశాల్లో మహేశ్వంశీ పైడిపల్లి ప్రాజెక్టు ఒకటి. సరిలేరు నీకెవ్వరు రిలీజ్ కు ముందే కన్ఫర్మ్ అయిన ఈ ప్రాజెక్టు అర్ధాంతరంగా ఆగిపోవడం అభిమానులతోపాటు ఇండస్ట్రీ వర్గాలను కూడా ఆశ్చర్యపరిచింది. కథగా లైన్ నచ్చిన మహేశ్ పూర్తి స్క్రిప్ట్ నచ్చకపోవడం వల్లే ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. ఆ వెంటనే.. గీత గోవిందంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పరశురామ్ తో మహేశ్ సినిమా కన్ఫర్మ్ చేశాడు అనే టాక్ మరింత సంచలనంగా మారింది.

 

 

అయితే.. నాగ చైతన్యతో పరశురామ్ సినిమా కమిట్ అవడం గత డిసెంబర్ లో పూజా కార్యక్రమం కూడా జరుపుకోవడం జరిగింది. త్వరలో షూటింగ్ వెళ్లాల్సిన ఆ సినిమాను మహేశ్ పిలుపుతో పక్కన పెట్టేస్తాడా.. చేస్తాడా, మహేశ్ తో సినిమా చేస్తాడా.. అనే సందేహాలు వచ్చాయి. దీంతో పరశురామ్ కూడా కన్ఫ్యూజన్ లో పడిపోయాడని న్యూస్ రౌండ్ అయింది. అయితే.. ఇప్పుడు వీటన్నింటికి ఫుల్ స్టాప్ పడిందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. పరశురామ్ చేయబోయే సినిమా నాగ చైతన్యతోనే ఉంటుందని ఇందులో అతనికి క్లారిటీ వచ్చిందని అంటున్నారు. మహేశ్ కూడా ఆ సినిమా పూర్తయ్యాకే పరశురామ్ తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడని అంటున్నారు.

 

 

ఈ గ్యాప్ లో మహేశ్ చిరంజీవితో సినిమాలో నటించే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మొత్తానికి ఈ వ్యవహారంలో అఫిషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. పరశురామ్ మాత్రం ఇటు సూపర్ స్టార్ తో అవకాశం.. అటు ముందే మొదలుపెట్టిన సినిమా.. ఈ రెండింటి మధ్యలో నలిగిపోయాడనే చెప్పాలి. నాగచైతన్య కూడా శేఖర్ కమ్ముల సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ న్యూస్ నిజమైతే పరశురామ్మహేశ్ ప్రాజెక్టుకు మరికొంత సమయం ఆగాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: