టాలీవుడ్ లో పెళ్లిచూపులు చిత్రంతో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది.  అచ్చమైన తెలుగు అమ్మాయిగా పేరు తెచ్చుకున్న రీతూ వర్మకు తెలుగు లో పెద్దగా అవకాశాలు రాలేదు.  ఈ మద్య తెలుగు ఇండస్ట్రీ ఇతర భాష హీరోయిన్ల జోరు పెరిగిపోతుంది. ఇప్పటికే రష్మిక మందన జోరు కొనసాగిస్తుంది.  మాలీవుడ్ లో కీర్తి సురేష్, సాయి పల్లవి లాంటి హీరోయిన్లు తెలుగు లో మంచి ఛాన్సులు కొట్టేస్తున్నారు.   ఇటీవల తెలుగు హీరోయిన్లకు ఎక్కువగా ఛాన్సులు ఇవ్వడం లేదని దర్శక, నిర్మాతలపై ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.  కానీ ఈ మద్య తెలుగు అమ్మాయిలకు కూడా ఛాన్సులు ఇస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో వస్తున్న చిత్రాలు కూడా జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకుంటున్నాయి. 

 

ఒకప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ కి మాత్రమే కలెక్షన్ల పరంగా ఓ క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి ’ తర్వాత ఇండియన్ మూవీస్ లో టాలీవుడ్ కి కూడా మంచి క్రేజ్ వచ్చింది.  ఇక పెళ్లిచూపులు చిత్రం తర్వాత రీతూ వర్మకు వరుస ఛాన్సులు వస్తాయని అనుకున్నారు.. కానీ అలాంటి అవకాశాలు రాలేదు. ఇక ఈ బ్యూటీ గ్లామర్ పరంగా నటించేందకు సిద్దమైనా కూడా అవకాశాలు మాత్రం రావడం లేదు. తాజాగా మలయాళంలో తెరకెక్కించిన 'కనులకనులను దోచాయంటే'  చిత్రంలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తో జోడి కట్టిన రీతూ వర్మకి మంచి మార్కులు పడ్డాయి.

 

రొమాంటిక్ అండ్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో రీతూ చాలా అందంగా కనబడింది. సాంప్రదాయ యువతిగా, మోడరన్ లేడీగా రెండు డిఫరెంట్ షేడ్స్ కలిగిన పాత్రలో ఆమె చక్కని వేరియేషన్స్ చూపించింది.  అయితే మాలీవుడ్ లో ఈ బ్యూటీ ప్రయత్నాలు మొదలు పెట్టింది.  ఇప్పుడు రీతూ వర్మకు మంచి అవకాశాలు కలిసి వచ్చేలా కనిపిస్తున్నాయి.  'కనులకనులను దోచాయంటే' లో రీతూ వర్మ పాత్రలో వున్న వేరియేషన్స్ చూస్తే ఆశ్చర్యం అనిపించకమానదు. అలాగే దుల్కర్ సల్మాన్ తో రొమాంటిక్ గాను రీతూ ఆకట్టుకుంది. వారి మధ్యన రొమాంటిక్ సీన్స్ చాలా బావున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: