రీ ఎంట్రీ ఫుల్‌ ఫాంలో దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమా తరువాత ఓ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌తో కలిసి మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ స్వయంగా కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌ మీద నిర్మిస్తున్నాడు. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

 

ఈ సినిమాలో చిరు నక్సలైట్‌గా కనిపిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. మరో వైపు ఈ సినిమా దేవాదాయ శాఖలోని అక్రమాల నేపథ్యంలో తెరకెక్కుతుందన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ సినిమాలో 15 నిమిషాల పాటు కనిపించే ఓ పవర్‌ఫుల్ పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నాడని చాలా రోజులు చెపుతూ వస్తున్నారు. చిత్ర యూనిట్‌ కూడా ఈ వార్తలను ఖండించకపోవటంతో మెగా స్టార్‌ సినిమాలో మెగా పవర్‌ స్టార్‌ నటించటం దాదాపు కన్‌ ఫార్మ్‌ అని అంతా భావించారు. కానీ ఆర్ ఆర్‌ ఆర్‌ షూటింగ్ ఆలస్యం కావటంతో సీన్‌ మారిపోయింది.

 

ప్రస్తుతం ఆర్ ఆర్‌ ఆర్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్న చరణ్‌, చిరు సినిమాకు డేట్స్ కేటాయించలేకపోతున్నాడు. ఇక సినిమాను వీలైనన్ని తక్కువ రోజుల్లో పూర్తి చేయాలని చిరు, దర్శకుడు కొరటాల శివకు కండిషన్‌ పెట్టడంతో మరోనటుడితో అయిన షూటింగ్ చేయాలని నిర్ణయించారు. ఇప్పుడు పాత్రలోనే సూపర్‌ స్టార్ మహేష్ బాబు నటించనున్నాడు. అయితే ఇప్పుడు చరణ్ కాకుండా మహేష్ ఆ పాత్రలో నటించటం కారణంగా సినిమా బడ్జెట్‌ 30 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇంత చిన్న పాత్ర అయిన మహేష్ పారితోషికం భారీగా ఇవ్వాల్సిందే. ఇక సూపర్‌ స్టార్‌ ట్రీట్‌మెంట్‌తో కలుపుకొని నిర్మాతకు భారీగా ఖర్చవుతున్నట్టుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: