ఆ మద్య తెలంగాణలో పెను సంచలనం రేపి వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం, హత్య కేసు దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. స్కూటి రిపేర్ చేయిస్తామని నమ్మబలికి నలుగురు దుర్మార్గులు దిశ అనే యువతిని మోసం చేసి చెట్ల పొదల్లోకి బలవంతంగా తీసుకు వెళ్లి ఒకరి తర్వాత ఒకరు దారుణంగా అత్యాచారం చేశారు. ఆ సమయంలో ఆమెకు మద్యం తాగించి కృరమృగాళ్లలా రెచ్చిపోయారు. ఆ తర్వాత ఆమెను దహనం చేసి చంపారు. అయితే ఈ కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించి నలుగురు నింధితులను పట్టుకున్నారు. అయితే వారు వెల్లడించిన నిజాలు విని పోలీసులే ఖంగుతిన్నారు. ఇక సీన్ ఆఫ్ యాక్షన్ సందర్భంగా నలుగురు నింధితులు పోలీసుల వద్ద ఆయుధాలు లాక్కొని వారిపై దాడి చేయడంతో తమ ఆత్మరక్షణ కోసం వారిని ఎన్ కౌంటర్ చేశారు.
ఇది జరిగిన తర్వాత పోలీసులపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురిపించారు. అయితే దిశ హత్య కేసు ఎంత సంచలనం రేపిందో దేశ వ్యాప్తంగా తెలిసిందే. ఇక వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ ఈ మద్య రియల్ స్టోరీలకు సంబంధించిన సినిమాలు తీస్తున్న విషయం తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ3 వారాల క్రితం హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచార ఘటనపై ఒక సినిమా తీస్తున్నానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. రాంగోపాల్ వర్మ కథల కోసం పెద్దగా వెతకడు.. కాంట్రవర్సీలే ఈయనకు కథలు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పలు సందర్బాల్లో చెప్పిన విషయం తెలిసిందే.
ఇటీవల లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు లాంటి వివాదాస్పద సినిమాలతో తెగ హల్ చల్ చేశారు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు వర్మ. కొన్నేళ్లుగా కేవలం రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఉండే కథలను మాత్రమే సినిమాలుగా తెరకెక్కిస్తున్న వర్మ.. ఇప్పుడు దిశ ఘటనపై ఫోకస్ చేసాడు. ఈ మూవీలో చాలా భయంకరమైన నిజాలు చెప్పబోతున్నానని ప్రకటించాడు. ఇప్పుడు చిత్ర షూటింగ్ మొదలుపెట్టినట్లు సమాచారం.