తెలుగు లో వస్తున్న కామెడీ షో జబర్ధస్త్ గురించి తెలియని వారు ఉండరు.  ఏడే సంవత్సరాల క్రితం ప్రారంభం అయిన ఈ కామెడీ షో ఇప్పడికీ ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్విస్తూనే ఉంది.  ఇందులో కొత్త కమెడియన్స్ రావడం.. పాత కమెడీయన్స్ వెళ్లడం చూస్తున్నాం. అయితే ఇప్పటి వరకు జబర్ధస్త్ లో వచ్చిన యాంకర్లు మాత్రం స్థిరంగా ఉంటూ వచ్చారు.  మద్యలో చిత్రాల్లో నటిస్తూ యాంకర్లుగా కొనసాగుతూ వస్తున్నారు.  జబర్ధస్త్, ఎక్స్ ట్రా జబర్ధస్త్ కార్యక్రమాల్లో యాంకర్లు అనసూయ, రష్మి గౌతమ్ లు కొనసాగుతున్నారు.  ఈ ఇద్దరు భామలు సోషల్ మాద్యమాల్లో ఎప్పుడు తమదైన పోస్టింగ్ లు.. కామెంట్స్ చేస్తూ ఉంటారు. 

 

ముఖ్యంగా నెటిజన్ల విషయంలో కాస్త అతి చేస్తుంటారని టాక్.  తాజాగా యాంకర్ రష్మికి నెటిజన్లకు మద్య తాప్సీ నటించిన ‘తప్పడ్’ చిత్రం గురించి పెద్ద వార్ జరిగింది.  ఇటీవల నటి తాప్సీ నటించిన ‘తప్పడ్’ చిత్రం రిలీజ్ అయ్యింది. అయితే ఈ చిత్రం చూడకూడదు అంటూ తప్పడ్ బైకాట్ అంటూ నెటిజన్లు సోషల్ మాద్యమాల్లో పోస్ట్ పెట్టారు. దీనిపై తాప్సీ నెటిజన్లపై ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మూవీ గురించి యాంకర్ రష్మీకి కొంత మంది నెటిజన్లకు వివాదం నడుస్తుంది. హీరోయిన్‌ తాప్సీ నటించిన తప్పడ్ సినిమాను చూశానని, కుటుంబంతో కలిసి చూడతగిన మూవీ అని యాంకర్‌ రష్మీ చేసిన ఓ పోస్టు చేసింది యాంకర్ రష్మి.  అయితే ఈ పోస్ట్ పై నెటిజన్లు విమర్శలు గుప్పించారు.

 

ఈ బాలీవుడ్‌ చిత్రం 'బాయ్‌కాట్‌ తప్పడ్‌' అనే హ్యాష్‌ట్యాగ్‌లో నెటిజన్లు పెద్ద ఎత్తున ట్వీట్లు చేస్తున్న విషయం తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టానికి నిరసన తెలుపుతున్న వారికి ఆమె మద్దతు తెలపడంతో తాప్సీకి ఇటువంటి పరిస్థితి ఎదురవుతోంది. ఆల్‌ రెడీ బాయ్‌ కాట్‌ చేశాం', 'చెత్త సినిమా' అంటూ నెటిజన్లు రిప్లై ఇస్తున్నారు. కొంత సేపటి తర్వాత  రష్మీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 'నా పోస్టుకి నెగిటివ్‌ కామెంట్లు చేస్తోన్న వారు అసలు నిజంగా ఈ సినిమాను చూశారా? ట్రైలర్‌ మాత్రమే చూసి, ఈ సినిమాపై ఓ అవగాహనకు వచ్చి కామెంట్లు చేస్తున్నారా??' అని మరో పోస్ట్ చేసింది. ఇలా రష్మీకి నెటిజన్లకు వరుసగా ట్విట్ల యుద్దం నడుస్తూనే ఉంది .

మరింత సమాచారం తెలుసుకోండి: