తెలుగు లో వస్తున్న పాపులర్ కామెడీ షో జబర్ధస్త్ అంటే ఆడియన్స్ కి ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఏడేళ్ల క్రితం మొదలైన ఈ కామెడీ షో ద్వారా ఇప్పటికీ ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు వెలుగు లోకి వచ్చారు.  ప్రస్తుతం కొంత మంది ఆర్థికంగా కూడా బాగా సెటిల్ అయ్యారు.  వేణు, తాగుబోతు రమేష్, ధన్‌రాజ్ మరొకొంత మంది కమెడియన్లు ఇండస్ట్రీలో మంచి కమెడియన్లు గా కొనసాగుతున్నారు.  షకలక శంకర్, సుధీర్ లాంటి వారు మొదట్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి.. తర్వాత హీరోలుగా మారారు.  ఓ వైపు వెండితెరపై నటిస్తూనే మరోవైపు బుల్లితెరపై తమ సత్తా కొనసాగిస్తున్నారు.

 

ఇక జబర్ధస్త్ తో పరిచయం అయిన యాంకర్లు అనసూయ, రష్మీ గౌతమ్ లు వరుసగా వెండితెరపై నటిస్తూనే వివిధ ఛానల్స్ లో యాంకర్లుగా కొనసాగుతున్నారు.  రష్మిక అయితే కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తుంది.. కానీ పెద్దగా కలిసి రావడం లేదు. ఇటీవల జబర్ధస్త్ లో కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి.  ఏడేళ్లుగా ఇందులో జడ్జీగా కొనసాగుతూ వస్తున్న మెగా బ్రదర్ నాగబాబు ఈ మద్య జి తెలుగు లో వస్తున్న అదిరింది కామెడీ షోకి జడ్జీగా వెళ్లారు.  ఆయనతో పాటు కొంత మంది కమెడియన్లు వెళ్లారు. 

 

తాజాగా 'జబర్దస్త్' నటులు సుడిగాలి సుధీర్, ఆటో రామ్‌ ప్రసాద్‌తో పాటు బుల్లెట్‌ భాస్కర్, అప్పారావు, రాము, రాకింగ్‌ రాకేశ్ తదితరులకు 'లాఫ్టర్‌ అవార్డ్‌ 2020' అవార్డులు దక్కాయి. హైదరాబాద్‌లోని బంజాబాహిల్స్‌లోని ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డులు అందించారు. అవార్డులు అందుకున్న వారిలో చాలా మంది జబర్దస్త్‌ నటులే ఉన్నారు. ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన రసమయి బాలకిషన్‌ పాటలు పాడి అందరిలోనూ జోష్ నింపారు. ఇక ఈ కార్యక్రమంలో బి ప్రిపేర్డ్‌ ఎడ్యుకేషన్‌ యాప్‌ను విడుదల చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: