మగధీర సినిమా టైంలో నిర్మాత అల్లు అరవింద్కు, దర్శకుడు రాజమౌళికి కాస్త చిన్న గ్యాప్ వచ్చిందన్న ప్రచారం జరిగింది. ఈ సినిమా ప్రమోషన్లలో అల్లు అరవింద్, మెగా కాంపౌండ్ రాజమౌళి పేరును వాడలేదన్న టాక్ బలంగా వినిపించింది. అయితే ఈ విషయాన్ని రాజమౌళి కూడా మరోలా ఒప్పుకున్నాడు. అయితే అదంతా గతం. మగధీర తర్వాత మళ్లీ మెగా హీరోలతో రాజమౌళి సినిమా చేయలేదు. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత మళ్లీ అదే రామ్ చరణ్తో రాజమౌళి సినిమా చేస్తున్నాడు.
ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్తో పాటు రామ్ చరణ్ కూడా అల్లూరి సీతారామ రాజుగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ మెగా కాంపౌండ్ పై రాజమౌళి అసహనంతో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మెగాస్టార్-కొరటాల శివ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా ఆచార్య. కనీసం యేడాది నుంచి ఈ సినిమా చర్చల్లో నానుతోంది. ఈ సినిమాలో చరణ్ కూడా ఓ పాత్రలో నటిస్తున్నాడని టాక్ వచ్చింది. అయితే చరణ్ ఆర్ ఆర్ ఆర్లో ఉండడంతో ఆ సెట్స్ నుంచి బయటకు వచ్చేందుకు రాజమౌళి ఇష్టపడలేదట.
చివరకు మహేష్ పేరు వినిపించింది. అయితే చిరు చరణ్ ఈ సినిమాలో ఉండాలని పట్టుబట్టడంతో పాటు రాజమౌళిపై ప్రెజర్ చేయడంతో రాజమౌళి మెగాస్టార్ను నొప్పించలేక చరణ్నే పెట్టుకోమని చెప్పేశాడట. అవసరమైతే ఆర్.ఆర్.ఆర్ కన్నా ముందే రిలీజ్ చేసుకోమని కూడా అన్నట్టు భోగట్టా.. ?
అసలు కొరటాల - చిరు సినిమా సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుంచి ఏ విషయంలోనూ క్లారిటీ ఉండడం లేదు. ముందు హీరోగా చరణ్ అన్నారు.. తర్వాత మహేష్ అన్నారు.. ఇప్పుడు మళ్లీ చరణ్ అంటున్నారు. ఇప్పుడు రాజమౌళి సైతం అసహనంతో ఉన్నాడని అంటున్నారు. మరి ఈ విషయంలో వాస్తవ అవాస్తవాలు ఏంటో వాళ్లకే తెలియాలి.