ఇండియాలో బెస్ట్ హాలీడే స్పాట్‌ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే ప్లేస్ గోవా. బీచ్‌ అందాలతో అలరారే ఇక్కడ పార్టీ కల్చర్‌ ఓ రేంజ్‌లో కనిపిస్తుంది. అందుకే ఏ మాత్రం గ్యాప్ దొరికినా సెలబ్రిటీలు కూడా గోవాలో వాలిపోతుంటారు. ఇక న్యూ ఇయర్‌ లాంటి పార్టీలకైతే గోవాలో ఓ రేంజ్‌లో సందడి కనిపిస్తుంది. అందుకే అక్కడ సొంత ప్రాపర్టీస్‌ను కూడా తీసుకుంటున్నారు మన స్టార్స్‌.

 

తాజాగా ఓ బాలీవుడ్ స్టార్ హీరో గోవాలో ఓ కాస్ట్‌లీ విల్లాను సొంతం చేసుకున్నాడు. దాదాపు  5 కోట్లతో బీచ్‌ వ్యూ ఉండేలా ఓ భవంతిని కొనుగోలు చేశాడు అక్షయ్‌ కుమార్. బాలీవుడ్‌ లో హైయ్యస్ట్ పెయిడ్‌ యాక్టర్స్‌ లిస్ట్‌లో స్థానం సంపాదించికున్న అక్షయ్‌ షూటింగ్ గ్యాప్ దొరికితే చాలు గోవా వెళ్లిపోతుంటాడు. అందుకే అక్కడ ఓ విల్లా కొనేశాడు అక్షయ్‌.

 

గోవాలోని వైట్ సాండ్ బీచ్‌లో అక్షయ్‌ విల్లా కొన్నాడు. ఈ సందర్భంగా అక్షయ్‌ మాట్లాడుతూ.. `నాకు గోవా వెళ్లటం ఇష్టం. అక్కడ చాలా ఎంజాయ్ చేస్తాను. అక్కడ అందరికీ నేను తెలుసు. అందరు నన్ను విష్‌ చేస్తారు. కానీ ఎవరు నా వల్ల ఇబ్బంది పెట్టరు. దేశంలో అక్కడ మాత్రమే నేను ఫ్రీగా తిరుగుతాను, ఎంజాయ్ చేస్తాను. అక్కడ అంతా సుఖంగా ఉంటుంది. ఉదయాన్నే ఎంత ఆలస్యంగా అయినా లేవొచ్చు. అక్కడ మొబైల్‌ తో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు.

 

ఎందుకంటే నా ఇళ్లు సిగ్నల్‌ అందని ప్లేస్‌ ఉంది. అందుకే ఫోన్‌ డిస్ట్రబెన్స్‌ కూడా ఉండదు. సాయంకాలాల్లో సముద్రంలో స్నానం చేస్తూ ఎంజాయ్ చేస్తాను. ఇక సినిమాల విషయానికి వస్తే రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూర్యవంశీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు అక్షయ్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: