ఈ వారంలో బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో చోటుచేసుకున్న ఆసక్తికర విషయాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.  

 

యువ కథానాయకుడు టైగర్ షరాఫ్, ఆషీకీ 2 హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటించిన భాగీ 3 మార్చి 6వ తేదీన రిలీజ్ అవ్వగా ఈ చిత్రం ఇప్పటికే బ్లాక్ బస్టర్ సినిమాగా పేరు సంపాదించుకుంది. భాగీ 3 విడుదలైన ఒక్క రోజుల్లోనే రూ.17.50 కోట్లుని సంపాదించి 2020లో అత్యంత ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా రికార్డు బద్దలు కొట్టింది. ఈ సినిమా తర్వాత అక్షయ్ కుమార్ నటించిన తానాజీ ఒక్క రోజులో రూ.15.10 కోట్లు సంపాదించి రెండవ స్థానంలో ఉంది. 

 

 


ఇకపోతే బీటౌన్ సెలబ్రిటీస్ ఆఫ్ స్క్రీన్ విశేషాలు తెలుసుకుంటే... టైగర్ షరాఫ్ 30 వ పుట్టినరోజు సందర్భంగా తన చిన్ననాటి ఫోటో ఒకటి నెట్టింట దర్శనమై అభిమానులని బాగా ఎంటర్టైన్ చేసింది. మరోవైపు సారా అలీ ఖాన్ తన సోదరుడు అయిన ఇబ్రహీం అలీ ఖాన్ పుట్టిన రోజు సందర్భంగా బికినీ ధరించి వాటిని నెట్టింట అప్లోడ్ చేసింది. 

 

 

అయితే ఆమె బికినీ ధరించి తన సోదరుడితో చాలా అభ్యంతరకరంగా ఫోటోలకి పోజులివ్వడంతో నెటిజన్లు ఆమెని ఏకిపారేశారు. సారా అలీ ఖాన్ రెండు ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో అప్లోడ్ చేసి తన సోదరుడైన ఇబ్రహీం అలీ ఖాన్ కు బర్తడే విషెస్ చెప్పింది. 

 

 


మార్చి 2వ తేదీన సూర్యవంశీ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలయి యూట్యూబ్ ట్రేండింగ్ లిస్ట్ లో రెండు రోజుల వరకు టాప్ ప్లేస్ లో నిలిచింది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో చాలా మంది ప్రముఖులు హాజరు కాగా.. అక్షయ్ కుమార్, కత్రీనా కైఫ్, రణ్ వీర్ సింగ్, అజయ్ దేవగన్, ఫిలిం మేకర్ కరణ్ జోహార్, డైరెక్టర్ రోహిత్ శెట్టి కలిసి ఒక సెల్ఫీ ఫోటో తీసుకొని నెట్టింట షేర్ చేశారు. ఐతే ఈ సెల్ఫీ ఫోటో ఈ వారంలో ఉత్తమ చిత్రం గా చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: