కరోనా దెబ్బకు విదేశాలకు వెళ్ళడానికి టాప్ హీరోలు అంతా భయపడిపోతున్న సమయంలో ప్రభాస్ మాత్రం చాల సాహసంతో యూరప్ వెళ్ళి అక్కడ తన లేటెస్ట్ మూవీకి సంబంధించిన షూటింగ్ లో పాల్గొంటూ ఈ మూవీని ఎట్టి పరిస్థితులలోను జూన్ లోపు పూర్తి చేయాలని ప్రభాస్ గట్టి పట్టుదల పై ఉన్నాడు.ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉంటే ప్రభాస్ లేటెస్ట్ గా కమిట్ అయిన నాగ్ అశ్విన్ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు లీక్ అయింది.


సుమారు 400 ల కోట్ల బడ్జెట్ తో తీయబోతున్న ఈ మూవీ ఒక ఫ్యాంటసీ కథతో కూడిన సైన్స్ ఫిక్షన్ అన్న విషయం ఇప్పటికే లీక్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరొక ఆసక్తికర విషయం లేటెస్ట్ గా లీక్ అయింది. 


ఇంటర్నేషనల్ డ్రగ్ మాపియా కథతో కూడిన ఈ మూవీ కథ ప్రమాదకర స్టెరాయిడ్ల బిజినెస్ కు సంబంధించిన మాఫియా చుట్టూ తిరుగుతూ మధ్యలో రాజుల కాలంనాటి  రోజులలోకి వెళ్ళిపోతుందట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ ఈ సంవత్సరం ఆగష్టు నుండి ప్రారంభం అవుతుందని అంటున్నారు. 


ఒకవైపు అలనాటి చక్రవర్తుల కాలంలోకి వెళ్ళి మళ్ళీ భవిష్యత్ కాలంనాటి ఫ్యాంటసీని టచ్ చేస్తూ ఇలా కథ ముందుకు వెనక్కు వెళ్ళే లా స్క్రీన్ ప్లే వ్రాస్తున్నారట. ఈ సినిమా ఫుల్ యాక్షన్ ఓరియెంటెడ్ గా ఉండటమే కాకుండా ఈ మూవీని దర్శకుడు నాగ్ అశ్విన్ 80శాతం వరకు గ్రీన్ మ్యాట్ లోనే తీస్తాడని తెలుస్తోంది. ఈ ఏడాది లో రెండు సార్లు 15 రోజుల వంతున ప్రభాస్ డేట్ లు ఈ సినిమాకు కేటాయిస్తున్న పరిస్థితులలో ఈ 30 రోజులలో కూడ ప్రభాస్ చేయబోయే గ్రీన్ మ్యాట్ బ్యాక్ డ్రాఫ్ ఫైట్లనే చిత్రీకరిస్తారట. ఇలా హాలీవుడ్ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీ పై సుమారు 800 ల కోట్ల స్థాయిలో బిజినెస్ చేయాలని అశ్విని దత్ నాగ్ అశ్విన్ ల మార్కెటింగ్ ప్లాన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ న్యూస్ గా మారింది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: