'నీది నాది ఒకే కథ' ఫేమ్ వేణు ఊడుగుల డైరెక్షన్ లో రానా , సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం 'విరాటపర్వం'. జనవరి నుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుండగా రెండు రోజులక్రితం కీలకమైన యాక్షన్ షెడ్యూల్ ను కంప్లీట్ చేశారు. తదుపరి షెడ్యూల్ వచ్చే వారం లో స్టార్ట్ కానుంది. ఈ యాక్షన్ సన్నివేశాలను హాలీవుడ్ స్టంట్ మాస్టర్ స్టీఫన్ రిచ్టర్ కొరియోగ్రఫి చేశాడు. సినిమాలో ఈ యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ కానున్నాయట కాగా స్టీఫెన్ గతంలో బాలీవుడ్ బ్లాక్ బ్లాస్టర్ మూవీ ఉరికి స్టంట్ మాస్టర్ గా వ్యవహరించాడు. ఆయనతోపాటు హాలీవుడ్ సినిమాటోగ్రఫర్ దని సాంచెజ్-లోపెజ్ విరాటపర్వం కు కెమెరామెన్ గా పనిచేస్తున్నాడు.
ఇక ప్రస్తుతం రానా కూడా ఈ సినిమా షూటింగ్ లో పూర్తి స్థాయిలో పాల్గొంటున్నాడు. ఆయన ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుండగా సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనుంది.
తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్
లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో మలయాళ నటి
నందిత దాస్,
ప్రియమణి,ఈశ్వరి రావు, జరీనా వాహబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
సురేష్ ప్రొడక్షన్స్ , ఎస్ ఎల్
వి సినిమాస్ బ్యానర్ల పై
సురేష్ బాబు , చెరుకూరి
సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జులై లో విడుదలకానుంది.
ఇక ఈ
సినిమా కన్నా ముందు
రానా ,అరణ్య తో ప్రేక్షకులముందుకు రానున్నాడు. ఇటీవలే
రానా డబ్బింగ్ కూడా కంప్లీట్ చేశాడు ఏప్రిల్ 2న ఈ చిత్రం విడుదలకానుంది. ఇక సాయి పల్లవి ప్రస్తుతం విరాటపర్వం తో పాటు
నాగ చైతన్య తో కలిసి
శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో
లవ్ స్టోరి లో నటిస్తుంది. ఈచిత్రం ఈ ఏడాది మే లో విడుదలకానుంది.