ఒకప్పుడు స్టార్ హీరోలతో  మాత్రమే సినిమాలు చేసిన ఈ ప్రొడక్షన్ హౌస్ ఇప్పుడు పనితనం ఎక్కడుందో, పనికొచ్చేవాళ్లు, పైకొచ్చేవాళ్లు ఎక్కడుందో  పనిగట్టుకుని  వెతికిమరీ  అవకాశాలు ఇస్తున్నారు అల్లు అరవింద్. యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చెయ్యడానికి ఎప్పుడూముందే ఉంటానంటున్నాడు మెగా ప్రొడ్యూసర్.

 

ఇండస్ట్రీ ఏ ఒక్కరి సొత్తూ కాదు. టాలెంట్ ఉన్నవాడే హీరో. పని వచ్చిన వాడే పైకొస్తాడు అంటూంటారు అందరూ. అలా.. పనితనం ఉన్నవాళ్లని వెతికి పట్టుకుని యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్నారు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.  అందుకే అసలు సినిమా కూడా రిలీజ్ అవ్వకుమందే  షో వేయించుకుని చూసి..ఆ డైరెక్టర్ పనికి ఇంప్రెస్ అయ్యారు. అది ఎంతలా అంటే.. జస్ట్ ఫస్ట్ సినిమాతో ఇంట్రస్టింగ్ సినిమా డైరెక్ట్ చేసిన పలాస డైరెక్టర్ కు ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే పిలిచి మరీ అడ్వాన్స్ ఇచ్చి నెక్ట్స్ సినిమాకు ప్రీ బుక్ చేసేసుకున్నారు అల్లు అరవింద్.  

 

డైరెక్టర్ కే కాదు హీరోలకు కూడా ఇలాగే ఛాన్సిస్తున్నారు అల్లు అరవింద్. ఒకప్పుడు స్టార్ హీరోలతో పెద్ద బడ్జెట్ సనిమాలు చేసే గీతా ఆర్ట్స్  ఇప్పుడు యంగ్ టాలెంట్ ని కూడా యంకరేజ్ చేస్తోంది. లేటెస్ట్ గా నిఖిల్ కి ఇలాగే  బంపర్ ఆఫర్ ఇచ్చింది. నిఖిల్ హీరోగా కుమారి 24 ఎఫ్  సినిమా డైరెక్ట్ చేసిన సూర్య ప్రతాప్  తో 18 పేజెస్ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు అల్లు అరవింద్

 

నిఖిల్ అంటే చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి నమ్మి అవకాశం ఇచ్చారు అనొచ్చు. కానీ నిన్న కాకమొన్నొచ్చిన ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ కు కూడా ఇలాగే తన ప్రొడక్షన్ లో చాన్సిచ్చారు ఈ మెగా ప్రొడ్యూసర్ . కౌషిక్ డైరెక్షన్లో కార్తికేయ హీరోగా వస్తున్న చావుకబురు చల్లగా సినిమాని జిఎ2 పతాకంపై అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇలా యంగ్ టాలెంట్ ని యంకరేజ్ చేస్తూ.. ప్రామిసింగ్ సినిమాలు చేస్తున్నారు అల్లు అరవింద్. అయినా ఆయనేమన్నా సేవచేస్తున్నాడా ఏంటి..? కంటెంట్ ఉంది కాబట్టి లైమ్ లైట్లోకి తీసుకొస్తున్నారు అనుకుంటున్నారు సినీ జనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: