తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి, మంచు మోహన్ బాబు కాంబినేషన్ అంటే ఆ చిత్రం సూపర్ హిట్టే. చిరంజీవి హీరోగా.. మోహన్ బాబు విలన్ గా ఎక్కువ చిత్రాల్లో కనిపించారు. అయితే వీరిద్దరూ స్నేహితులుగా కూడా ఎన్నో చిత్రాల్లో నటించారు. వాస్తవానికి చిరంజీవి, మోహన్ బాబు ఇద్దరూ విలన్ పాత్రల్లోనే తమ కెరీర్ తొలినాళ్ళలో వెండితెరపై పునాదులు వేసుకున్నారు. తర్వాత ఇద్దరూ హీరోలుగా సత్తా చాటారు. ఇద్దరూ కల్సి నటించిన బిల్లా రంగా, కిరాయి రౌడీలు వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచాయి. ఇక చిరంజీవి, మోహన్ బాబు ఆఫ్ స్క్రీన్ ఇద్దరి మధ్య దశాబ్దాలుగా మంచి అనుబంధమే కొనసాగుతోంది. అప్పుడే ఇద్దరూ పబ్లిక్ లోనే ఒకరిని ఒకరు మాటలు విసిరేసుకుంటారు. అంతలోనే మళ్ళీ ఇద్దరూ ఒకటే అనే రేంజిలో ముద్దులు పెట్టేసుకుంటారు. తాజాగా ఇప్పుడు ఈ ఇద్దరు హీరోల తనయుడు హీరోలుగా వెండి తెరకు పరిచయం అయిన విషయం తెలిసిందే.
చిరంజీవి తనయుడు రామ్ చరణ్, మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్, మంచు విష్ణు హీరోలుగా పరిచయం అయ్యారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ ఇద్దరూ కలిసి ఓ మల్టీ స్టారర్ చిత్రంలో నటించబోతున్నారట. అది కూడా ఓ ఓల్డ్ సూపర్ హిట్ సినిమా అని సమాచారం. త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కబోతుందట. గతంలో చిరు, మోహన్ బాబు కలిసి నటించిన ‘బిల్లా రంగా’ అప్పట్లో సెన్సేషన్ హిట్ అయ్యింది. ఇందులో ఇద్దరూ ద్విపాత్రాభినయంలో నటించారు.
ఇక ‘బిల్లా రంగా’ రీమేక్ విషయమై కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఈ రీమేక్ విషయమై చర్చలు నడుస్తూనే ఉన్నాయి. తాజాగా ఈసినిమా రీమేక్ విషయమై ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అయితే ఒకవేళ ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తే.. ఎవరు డైరెక్ట్ చేస్తారన్నది చూడాలి. అలాగే ఈ సినిమాని చెర్రీ, మనోజ్లు సంయుక్తంగా తెరకెక్కించాలనుకుంటున్నారట. అయితే ఈ విషయం అఫిషియల్ గా అనౌన్స్ చేస్తే కానీ ఓ క్లారిటీ రాదని అంటున్నారు టాలీవుడ్ వర్గాలు.