టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి కేవలం బ్లాక్ బాస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించడం మాత్రమే కాదు అవి ఎప్పుడు రిలీజ్ చేయాలో కూడా బాగా తెలిసిన సినీ జ్ఞానీ. గతంలో రికార్డులన్నీ బద్దలు కొట్టిన బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 సినిమాలని సరైన సమయంలో విడుదల చేసి ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేశారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఆర్.ఆర్.ఆర్ చిత్రం యొక్క రిలీజ్ డేట్ ని కూడా లాక్ చేశారు రాజమౌళి. ఆగస్టు నెలలో పెద్దగా సినిమాలు రిలీజ్ కానీ సమయాన్ని అనుకూలంగా భావించిన రాజమౌళి జులై 30వ తేదీన తన తదుపరి చిత్రం అయిన ఆర్.ఆర్.ఆర్ ని విడుదల చేస్తున్నానని ప్రకటించాడు.




కానీ ఆ చిత్రం యొక్క షూటింగ్ కాస్త ఆలస్యం అవ్వడంతో తాను లాక్ చేసిన డేట్ కి సినిమా విడుదల అవ్వడం లేదు. రాజమౌళి మంచి ముహూర్తం చూసుకొని జులై 30న తన చరిత్రాత్మక సినిమాని రిలీజ్ చేసుకోవాలని భావించినా అది జరగడం అసాధ్యమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో ఆ మంచి ముహూర్తం ప్రస్తుతం ఫ్రీగా అలా ఉండిపోయింది. అయితే ఇప్పుడు ఫ్రీ గా జక్కన్న చూసిన మంచి ముహూర్తం పై కుర్ర హీరోల కన్ను పడింది. ఈ కుర్ర హీరోలలో ముఖ్యంగా నితిన్, వరుణ్ తేజ్ ఉన్నారు. నితిన్ హీరోగా నటిస్తున్న 'రంగ్ దే' సినిమాని జులై 30వ తేదీన రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నాడట. మరోవైపు వరుణ్ తేజ్ తన పదవ సినిమా విడుదలకి కూడా జులై 30వ తేదీ ని లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది.



ఇంకా దాదాపు ఐదు నెలల సమయం ఉండడంతో... నిర్మాతలు అల్లు వెంకటేష్ సిద్దు జులై 30వ తేదీని లాక్ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారట. ఏదేమైనా వరుణ్ తేజ్ తన సినిమాని జక్కన ముహుర్తానికే రిలీజ్ చేసే విధంగా తన సినిమాని తీస్తున్నాడన్నట్టు సినీ వర్గాల నుండి టాక్ వినిపిస్తోంది. అందరికీ తెలిసిన నిజం ఏంటంటే హీరో నితిన్, వరుణ్ తేజ్ మంచి స్నేహితులు. సో వీరు తమ నిర్మాతల మంచి కోరి తమ తదుపరి చిత్రాలని ఒకే సమయంలో కాకుండా వేరు వేరు డేట్స్ లలో విడుదల చేస్తారేమో అన్నది భవిష్యత్తులో తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: