టాలీవుడ్ లో ఇప్పుడు యువ హీరోయిన్ల హవా ఎక్కువగా కొనసాగుతుంది. ఇప్పుడు వస్తున్న దాదాపు అన్ని సినిమాల్లో ఎక్కువగా యువ హీరోయిన్లే ఎక్కువగా కనపడుతున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు ఒకరిద్దరు హీరోయిన్లు. దర్శకులు వారినే ఎంపిక చేసుకుంటున్నారు. ఇక టాలీవుడ్ జనం కూడా కాస్త కొత్తదనం కోరుకునే ప్రయత్నాలు చేయడంతో దర్శకులు కూడా కొత్త హీరోయిన్స్ ని ఎంపిక చేసే పనిలో పడ్డారు ప్రస్తుతం. ఇప్పటికే రష్మిక మంధనా పూజా హెగ్డే ఇద్దరూ కూడా టాలీవుడ్ లో ఒక ఊపు ఊపుతున్నారు. 

 

వీరి సినిమాలు వరుసగా హిట్ అవ్వడంతో దర్శక నిర్మాతలు కూడా వారినే ఎంపిక చేసుకుంటున్నారు. అయితే ఒకప్పుడు టాలీవుడ్ లో చక్రం తిప్పిన కొందరు హీరోయిన్స్ ని వద్దని అంటున్నారు దర్శకులు, అభిమానులు. దానికి కారణం ఏంటీ అనేది తెలియకపోయినా ముదురు హీరోయిన్ లు వద్దు అనే భావనలో టాలీవుడ్ జనాలు ఉన్నారు. అందుకే అనుష్క, సమంతా, తమన్నా, సహా మరికొందరిని పక్కన పెట్టేసారు. ప్రస్తుతం వారు సింగిల్ గా సినిమాలు చేసుకుంటున్నారు గాని హీరోల పక్కన పెద్దగా సినిమాలు చేయడం లేదు ఈ మధ్య కాలంలో. 

 

దానికి కారణం ఏంటీ అనేది తెలియకపోయినా అగ్ర హీరోలు కూడా ముదురు హీరోయిన్స్ ని వద్దని చెప్తున్నట్టు సమాచారం. వారి వలన సినిమాకు పెద్దగా ఉపయోగ౦ లేదని కొందరు నిర్మాతలు కూడా భావిస్తున్నారు. యువ హీరోయిన్స్ అయితే సోషల్ మీడియా మీద కూడా దృష్టి పెడుతున్నారు కాబట్టి సినిమా ప్రచారంలో కూడా ఎక్కువగా పాల్గొనే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వారికి అవకాశాలు ఇస్తే మంచిది అనే భావనలో ఉన్నారట. అందుకే ఇప్పుడు టాలీవుడ్ లో ముదురు హీరోయిన్ల గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదని అంటున్నారు. అందుకే చాలా మంది హీరోయిన్లు ఇప్పుడు తెలుగు వైపు కూడా చూడటం లేదని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: