బాలీవుడ్ లో రకరకాల ప్రయత్నాలు చేసి ఇప్పుడు టాలీవుడ్ మీద మళ్ళీ దృష్టి పెట్టిన హీరోయిన్ ఇలియానా ఇక్కడి దర్శకులతో తనకు ఉన్న పరిచయాలను గట్టిగానే వాడే ప్రయత్నం చేస్తుంది. ఆమె టాలీవుడ్ లో గతంలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. అయితే అనూహ్యంగా ఆమె కెరీర్ ఇబ్బందుల్లో పడింది. ఆమెతో సినిమాలు చేయడానికి పెద్దగా ఎవరూ ఆసక్తి చూపించలేదు. దీనితో ప్రేమించి పెళ్లి చేసుకునే ప్రయత్నాలు చేసిన ఈ భామ... బాలీవుడ్ కి కూడా వెళ్ళింది. ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది అనే వార్తలు కూడా ఎక్కువగానే వచ్చాయి. 

 

ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని ఆ తర్వాత బ్రేకప్ చెప్పింది అని కూడా మీడియా అంటుంది. దీనిపై ఏ స్పష్టతా ఇప్పటి వరకు రాలేదు. అయితే ఇప్పుడు ఈ భామ సినిమాలు చేయడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. తనను గతంలో ఆదరించిన టాలీవుడ్ లోనే సినిమాలు చేసేందుకు గాను తనకు గతంలో ఉన్న పాత పరిచయాలను ఆమె వాడే ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే టాలీవుడ్ స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ని ఆమె ముంబై లో కలిసినట్టు సమాచారం. ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక పని మీద ముంబై వెళ్లారట. 

 

అక్కడ ఆమెను కలిసినట్టు సమాచారం. త్రివిక్రమ్ వస్తున్న విషయం తెలుసుకున్న ఇలియానా... ఆయనకు ఫోన్ చేసి కలవాలని కోరినట్టు సమాచారం. తనకు అవకాశాలు ఇవ్వాలని ఆమె అడిగారట. తాను ఇక తెలుగులో రెగ్యులర్ గా సినిమాలు చెయ్యాలని భావిస్తున్నా అని కాబట్టి వచ్చే సినిమాల్లో తనకు అవకాశం ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేసింది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. వీరి కాంబినేషన్ లో గతంలో ఒక సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఆమె జులాయ్ అనే సినిమా చేసింది. ఆ సినిమా సూపర్ హిట్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: