యష్... అంతవరకూ కేవలం కన్నడ పరిశ్రమకు మాత్రమే ఆ పేరు తెలుసు. కానీ, ఈ రోజున యావత్ భారత దేశం మొత్తం అతని ప్రతిభ గురించి చర్చించుకుంటోంది. కారణం.. కేజీఎఫ్. ఇక డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి అయితే ఇక చప్పనవసరం లేదు. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఇక తెలుగు నుండి కూడా ప్రశాంత్ నీల్ కు ఎన్నో అవకాశాలు వస్తున్నా... ఆచి తూచి అడుగు వేయడం అతని నైజం.
ఇక హీరోలు సంగతి అందరికి తెలిసినదే. తమకి మంచి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకులకి అదిరిపోయే గిఫ్ట్లు ఇస్తూ వారిని బాగా ఎంకరేజ్ చేస్తూ వుంటారు. ఇటీవల మనం చూసుకుంటే తెలుగు లో చాలామంది హీరోలు చాలా మంది డైరెక్టర్లకు గిఫ్టులు ఇచ్చిన సంగతి అందరికి విదితమే. తాజాగా కేజీఎఫ్ హీరో యశ్ కూడా తన డైరెక్టర్ ప్రశాంత్ నీల్కి సామ్సంగ్ ఫ్లిప్ ఫోల్డబుల్ మొబైల్ని బహుమతి ఇచ్చి సర్ప్రైజ్ చేసాడు.
ఇక మార్కెట్ లో గాని మనం చేసుకున్నట్లైతే, ఈ మొబైల్ ధర 80వేల రూపాయలకు ఇంకా పెచ్చు ధరలలో ఇది లభ్యమౌతుంది. అయితే ఈ విషయాన్ని ప్రశాంత్ ఎంతో భావోద్వేగంతో తన మైక్రోబ్లాగ్ పేజ్లో పేర్కొన్నాడు. రాఖీ సర్ప్రైజ్ చేయడంతో నేను ఎంతో ఆశ్చర్యానికి, ఆనందానికి లోనయ్యాను అని స్పష్టం చేశాడు ప్రశాంత్. కన్నడతో పాటు హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో రిలీజ్ అయిన కేజీఎఫ్ సినిమా అన్ని భాషల్లో రికార్డ్ వసూళ్లు సాధించిన విషయం అందరికి విదితమే.
ఇక బాలీవుడ్లో కూడా బంపర్ హిట్గా నిలిచిన కేజీఎఫ్, సౌత్ సినిమా మీద అంచనాలను మరింత పెంచేసింది. అయితే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రానికి ప్రస్తుతం సీక్వెల్ రూపొందుతున్న విషయం విదితమే. ఫస్ట్ పార్ట్ కంటే కూడా ప్రశాంత్ నీల్ ఇందులో కొంచెం భారీగానే పెద్ద పెద్ద సినీ తారలను తీసున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో రవీనా టాండన్ , సంజయ్ దత్, రావు రమేష్తో పాటు పలువురు ప్రముఖులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నట్లు వినికిడి.