ఫ్యామిలీ సినిమాలతో ప్రేక్షకుల మది గెలిచిన హీరో. ఫ్యామిలీ సినిమాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ గా మారిన కథానాయకుడు జగపతిబాబు. ఇప్పడు తిరుగులేని విలన్ గా ఎన్నో సినిమాలలో నటించి మెప్పిస్తున్నారు. వేరు వేరు కోణాలైన హీరోయిజం, విలనిజాన్ని అద్భుతంగా పోషించి ఔరా అనిపించేలా చేయడం మామూలు విషయం కాదు.
తొలి సినిమాలోనే డబుల్ రోల్ చేసి అభిమానుల మనసుకు తీయని గాయం చేశాడు. లెజెండ్, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, అరవింద సమెతలలో విలన్ గా హీరోతో సమానంగా పాత్రల్లో మెప్పించాడు. పాత్ర ఎటువంటిదైనా తనదైన నటనతో రక్తికట్టించగల నటుడిగా ముద్రవేయించుకున్న జగపతిబాబు. అప్పటి నుండి విలన్గానే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా రాణిస్తున్నాడు జగపతిబాబు అలియాస్ జగ్గుభాయ్. విలన్ గా జగపతి బాబు సెకండ్ ఇన్సింగ్ మొదలు పెట్టి విలన్ నిజంలో కూడా తనదైన ముద్ర వేసుకున్నాడు ఈ హీరో.
ఒక దశలో అయన సౌత్ లోనే ఎక్కువ డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగారు. తమిళ.. మలయాళ చిత్రాల్లో కూడా నటించారు. పోయినేడాది రంగస్థలంలో విలన్ పాత్ర కూడా ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది. అయితే ఈ ఏడాది ఎందుకో జగపతిబాబు హవా తగ్గిందనే టాక్ వినిపిస్తోంది. సరిలేరు నీకెవ్వరులో ఒక ముఖ్య పాత్రకు మొదట జగపతిబాబునే తీసుకున్నప్పటికీ తర్వాత మాత్రం ఆ పాత్ర ప్రకాష్ రాజ్ కు దక్కింది. 'సైరా' లాంటి ఒకటి రెండు సినిమాల్లో నటించారు కానీ వేరే సినిమాల్లో ఆయన లేరు.
ఈ తరుణంలో మళ్లీ ఈయన్ని మెయిన్ లీడ్గా పెట్టి ఓ సినిమా తీయాలనుకుంటున్నారట. ఆసక్తికరమైన విషయమేమంటే..పాతికేళ్ల ముందు జగపతిబాబు, ఆమని నటించిన చిత్రం 'శుభలగ్నం' సినిమాకు సీక్వెల్ చేయాలనుకుంటున్నారట. ఈ సీక్వెల్లో కూడా జగపతిబాబునే లీడ్ రోల్లో నటింప చేయడానికైతే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జగ్గుభాయ్ నుండే దీనికి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందని టాక్.