కేకే రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఉగాది పండుగ సందర్భంగా ఈ చిత్రానికి 'ఓ డియర్' అనే టైటిల్ గానీ 'రాధేశ్యామ్' అనే టైటిల్ గానీ ఖరారు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సినిమా యొక్క షూటింగ్ జార్జియా లోని కొన్ని అందమైన ప్రదేశాలలో జరుగుతుంది. మొన్నీమధ్య పూజా హెగ్డే జార్జియా వెళ్లి తన షూటింగ్ షెడ్యూల్ కొంచెం పూర్తిచేసుకుని వచ్చేసింది.




కానీ ప్రభాస్ మాత్రం తరచుగా వర్షాలు కురుస్తూ 10 డిగ్రీల సెంటి గ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతున్న జార్జియా లో తన తదుపరి చిత్రం యొక్క షూటింగ్ లో ప్రతిరోజు పాల్గొంటూనే ఉన్నాడు. అసలే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ చల్లటి వాతావరణం ఉన్న దేశాలలో జెట్ స్పీడ్ తో వ్యాపిస్తుంది. కానీ ప్రభాస్ సినీ బృందం మాత్రం కరోనా వైరస్ ని లెక్క చేయకుండా వర్షాలు పడుతున్న చల్లటి వాతావరణంలో షూటింగ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని చాలా గర్వంగా డైరెక్టర్ రాధాకృష్ణ తన సోషల్ మీడియాలో చెప్పుకొచ్చాడు.




దాంతో అభిమానులు ప్రభాస్ ని రిస్క్ తీసుకోవద్దని చెబుతూ తన హెల్త్ గురించి తెగ కంగారు పడిపోయారు. కానీ నిజమేమిటంటే ప్రభాస్ అండ్ టీమ్ వెళ్లిన ఒక జార్జియా సిటీ లో ఇంతవరకు ఒక్క కరోనా వైరస్ కేసు కూడా నమోదు కాలేదు. సో, అసలు వైరస్సే లేని చోట ప్రభాస్ ఉంటున్నాడు కాబట్టి అతనికి కరోనా సోకే ఛాన్సే లేదు. ఇక పోతే ఈ సినిమా ఏడాది చివరిలో రిలీజ్ అవుతుండగా... ప్రభాస్ ఓ సోది చెప్పే వాడి పాత్రలో కనిపించనున్నాడు. పూజా హెగ్డే మాత్రం యువరాణి క్యారెక్టర్ లో కనిపించనుంది. రెబెల్ స్టార్ కెరీర్ లో 20వ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయని చెప్పొచ్చు. మరి తన 20వ మూవీ తో ప్రభాస్ హిట్ కొడతాడో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: