ఇండియన్ సినిమాలో ఒక సంచలనం సృష్టించిన చిత్రం కేజీఎఫ్. బంగారు గనుల నేపధ్యంలో వచ్చిన ఈ సినిమా ఒక ఊపు ఊపింది. ప్రత్యేక౦గా ఈ సినిమాకు ఫాన్స్ ఉన్నారు అంటే ఈ సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో అర్ధం చేసుకోవచ్చు. ముందు ఈ సినిమాలో హీరోగా నటించిన యష్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అలాగే దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన విధానం చూసి ప్రేక్షకులు ఈ సినిమాను అలాగే చూస్తుండిపోయారు. ఆ విధంగా ఈ సినిమా ప్రభావం చూపించింది. ప్రతీ సీన్ కూడా చాలా అందంగా చూపించాడు దర్శకుడు. 

 

ఇక ఇప్పుడు ఈ సినిమా రెండో భాగం ప్రేక్షకుల ముందుకి వస్తుంది. ఈ ఏడాది దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకి వస్తుంది. ఇది పక్కన పెడితే ఈ సినిమా కోసం భారీగా బాలీవుడ్ నిర్మాతలు పోటీ పడుతున్నారు. హక్కుల కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు. అయినా సరే నిర్మాత లు మాత్రం ఈ సినిమాను అమ్మడానికి ఆసక్తి చూపించడం లేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కీలక దశలో ఉంది. ఒక బాలీవుడ్ దర్శకుడు అయితే ఈ సినిమాను 40 కోట్లకు అడిగినట్టు సమాచారం. అయినా సరే ఇవ్వడానికి ముందుకి రాలేదట. 

 

మరో నిర్మాత అయితే 60 కోట్లకు  ఈ సినిమా హక్కులను అడిగినా సరే ఇవ్వడానికి ముందుకి రాలేదట. ఇక ఈ సినిమాలో విలన్ గా... సంజయ్ దత్ తో పాటుగా బాలీవుడ్ కీలక నటులు నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని కూడా విడుదల చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే ఫస్ట్ లుక్ ని కూడా ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమా సోషల్ మీడియా లో కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: