నిధి అగర్వాల్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం లేని పేరు. ఈమె మొదట హిందీ సినిమా అయిన 'మున్నామైఖెల్' తో బాలీవుడ్ కి పరిచయం అయింది. ఈమె తన తొలి సినిమాలోనే తన అందాలను ఆరబోసింది. అలాగే తన స్టెప్పులతో అభిమానుల మనసును దోచుకుంది ఈ భామ. ఈమె ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. తాను ఎప్పటికప్పుడు తాను వయ్యారాలను ఒలకబోస్తూ దిగిన ఫొటోస్ ను మీడియాలో షేర్ చేయటంతో అమ్మడుకి బాగా ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు. ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీకి అక్కినేని నాగ చైతన్య నటించిన సవ్యసాచి సినిమాలో చైతన్య సరసన హీరోయిన్ గా నటించి ఇండస్ట్రీకి పరిచయమయింది. 


తరువాత అక్కినేని అఖిల్ హీరోగా నటించిన మిస్టర్ మజ్ను సినిమాలో అఖిల్ సరసన హీరోయిన్ గా నటించింది. కానీ.. ఈ అమ్మడు నటించిన రెండు చిత్రాలు పెద్దగా విజయం సాధించకపోయినా టాలీవుడ్ లో తన పేరు గుర్తుండిపోయేలా చేసాయి. ఇటీవల పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన సినిమా, రామ్ పోతినేని హీరోగా నటించిన సినిమాలో నిధి అగర్వాల్ నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో నిధికి మంచి మార్కులు పడ్డాయని చెప్పవచ్చు. 


అయితే ఇంత హిట్ అయిన సినిమాలో 'ఇస్మార్ట్ శంకర్' నటించిన కూడా నిధి అగర్వాల్ కు తెలుగులో మాత్రం తనకు అవకాశాలు మాత్రం రావడం లేదట. తెలుగులో మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లాతో చేస్తున్న సినిమా మినహా ఆమె చేతిలో మరో తెలుగు సినిమా లేదని సమాచారం అందింది. నిధి అగర్వాల్ ఈ ఏడాది పలు చిత్రాలతో కన్నడ, తమిళంలో అడుగు పెట్టనుందని తెలుస్తోంది.ఈ మధ్య ఒక ప్రముఖ కథానాయకుడితో నటిస్తుందని వార్తలు వెలువడినా అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. హిట్ సినిమా చేసిన తర్వాత కూడా టాలీవుడ్ లో పెద్ద ఆఫర్లు రాకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తన నటనతో డాన్సులతో మంచి గుర్తింపు తెచ్చుకున్నా అదృష్టం మాత్రం కలిసి రావడం లేదని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: