టాలీవుడ్ లో మాస్ మహారాజ్ రవితేజ అండ్ పూరి జగన్నాద్ కాంబినేషన్ మంచి సూపర్ హిట్ పైర్. వీరిద్దరు కలిసి సినిమా తీస్తే హిట్ అవ్వడం ఖాయం. పూరీ జగన్నాథ్ ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, మరియు రచయిత. పూరి జగన్నాధ్ ప్రతి సినిమాకి వేరియేషన్ చూపిస్తాడు. కధ కూడా కొత్తగా ఉంటుంది. తన సినిమాలో హీరోయిన్స్ కూడా కొత్తవాళ్లే.
అలాగే మాస్ మహారాజ్ రవితేజ కూడా మంచి పేరు ఉన్న హీరో. ఒక విధంగా చెప్పాలంటే రవితేజని మాస్ మహారాజ్ గా నిలబెట్టింది పూరి జగన్నాద్. రవితేజ డైలాగ్ డెలివరీ లో గాని, మాస్ ఆటిట్యూడ్ చూపించడంలో గాని దిట్ట. అలాంటి పూరి జగన్నాధ్ కి రవితేజ కి మధ్య సంబంధం బలపడింది. వీళ్ళద్దరు కలిసి కొన్ని సినిమాలు కూడా తీశారు. మంచి పేరు కూడా వచ్చింది.దగ్గర దగ్గర వీరి కాంబో లో 5 సినిమాలు వచ్చాయి.
వీరిద్దరి కాంబినేషన్ లో మొట్టమొదట వచ్చిన సినిమా ఇట్లు శ్రావణి, సుబ్రహ్మణ్యం. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంలో రవి తేజ హీరోగా చేయగా సినిమా సూపర్ హిట్ అయి, గుర్తింపు తెచ్చిన సినిమా. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఇడియట్ సినిమాతో చంటిగాడు లోకల్ అన్నట్లు సినీ రంగంలో సెటిల్ అయ్యాడు.
తరువాత అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమాతో వరుస విజయాలు అందుకున్నారు వీరిద్దరూ. ఈ సినిమా తో పూరి రచయత గా మారారు. ఉత్తమ మాటల రచయత గా అవార్డు కూడా అందుకున్నాడు. తర్వాత వీరి కాంబినేషన్ లో వచ్చిన నేనింతే సినిమా కూడా మంచిగానే ఆడింది. ఈ సినిమా కి గాను 2009వ సంవత్సరంలో పూరి జగన్నాథ్ కు ఉత్తమ మాటల రచయితగా నేనింతే సినిమాకి గాను పూరి జగన్నాద్ నంది పురస్కారం అందుకున్నారు .
ఆ తర్వాత మళ్ళీ రవితేజ దేవుడు చేసిన మనుషులు సినిమాలో హీరోగా నటించాడు కానీ ఈ సినిమా ప్రజలని ఆకర్షించలేకపోయింది. తర్వాత మెల్లగా రవితేజ స్టార్ డమ్ కూడా తగ్గింది. ఒకానొక స్టేజిలో పూరి సినిమాలు కూడా సరిగా ఆడలేదు. ఆ తర్వాత పూరి అండ్ రవితేజ కాంబోలో సినిమాలు రాలేదు. వీల్లద్దరి జోడి మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుందో, బ్లాక్ బస్టర్ ఎప్పుడు వస్తుందో అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.