#RRR సినిమా.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రాబోతున్న సినిమాల్లో అతి పెద్ద సినిమా. దీనికి కారణం రాంచరణ్, ఎన్టీఆర్ నటిచడం. అంతకి మించి టాలీవుడ్ జక్కన రాజమౌళి ఈ సినిమాకి డైరెక్టర్ కాబట్టి. నిజానికి రాజమౌళి సినిమాల్లో హీరోలను ఎంత బాగా చూపిస్తారో అందరికి తెలిసిన విషయమే. ఆయన సినిమాలలో విలన్లకు కూడా అదే రేంజ్ స్క్రీన్ స్పేస్ ఉంటుంది అనడంలో ఎటువంటి అనుమానం లేదు. ఆయన డైరెక్ట్ చేసిన ఏ సినిమా చూసుకున్నా అందులో ప్రతి నాయకుడిని హీరో మాదిరిగా చూపిస్తారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి ఇద్దరు టాలీవుడ్ పెద్ద హీరోలతో ఢీ కొట్టడానికి బాలీవుడ్ స్టార్ హీరో అజయ్‌ దేవ్‌గన్‌ ను విలన్‌ గా ఎంచుకొని ఆ సినిమాలకి ఎంపిక చేసుకున్నారు.

 

 

 

ఈ సినిమాలో బలమైన పాత్రలో మన ముందుకు రాబోతున్న అజయ్ దేవగన్‌ కు జోడీగా టాలీవుడ్ సీనియర్ బ్యూటీ శ్రియను ఎంపిక చేసారని రాజమౌళి తెలిపారు. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరితో జోడీ కట్టిన ఈ బ్యూటీ అయితే ఇప్పుడు అజయ్ దేవగన్‌ కి పర్ఫెక్ట్ జోడని, అంతేకాకుండా శ్రియ అందచందాలు అదనపు ఆకర్షణ కానుండటంతో ఆమెను మొత్తానికి సెలెక్ట్  చేసినట్టు తెలుస్తోంది. 

 

 


ఇదివరకే వీరిద్దరూ కలిసి బాలీవుడ్ "దృశ్యం" మూవీలో నటించి మెప్పించారు. దీనితో ఈ కాంబోకి అక్కడ మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం వికారాబాద్ అడవుల్లో జరుగుతున్న #RRR షూటింగ్‌ కి శ్రియ కూడా అక్కడికి వెళ్లిందని, అజయ్, శ్రియలపై కొన్ని అక్కడ కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. మాములుగాతన చిత్రం క్యాస్ట్ అండ్ క్రూ విషయాలను అఫీషియల్‌గానే ప్రకటిస్తుంటారు డైరెక్టర్ రాజమౌళి. అయితే #RRR చిత్రంలో శ్రియ కూడా జాయిన్ అయ్యిందనే విషయాన్ని ఇంకా ప్రకటించాల్సి ఉంది రాజమౌళి.

మరింత సమాచారం తెలుసుకోండి: