తెలుగు సినీ పరిశ్రమలో అతి తక్కువ కాలంలో స్టార్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వాళ్ళలో శ్రీనువైట్ల ఒకరు. దాదాపు అందరు హీరోలతో ఆయన విజయవంతమైన సినిమాలు చేశారు. మహేష్ బాబు ,రవితేజ అదే విధంగా మంచు విష్ణు సూపర్ హిట్ సినిమాలు ఇచ్చారు శ్రీనువైట్ల .ఒకప్పుడు శ్రీనువైట్ల సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే వాళ్ళు. ప్రధానంగా సినిమాలో ఆయన హీరో తో చేసే కామెడీ హైలెట్ గా నిలుస్తుంది. దీనితో తెలుగులో ఆయనకు తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ వచ్చింది.

 

కానీ ఈ క్రేజు నిలబెట్టుకోవడంలో శ్రీనువైట్ల దాదాపుగా ఫెయిలయ్యారు అనే టాక్ ఎక్కువగా వినబడుతోంది. ఆయన చేసిన సినిమాలు ఇటీవల కాలంలో పెద్దగా హిట్ అవ్వలేదు. దీనితో ఆయన కథలన్నా ఆయన సినిమాలన్నా స్టార్ హీరోలు ఇప్పుడు భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. అందుకే ఆయనకు ఒకప్పుడు అవకాశమిచ్చిన హీరోలు ఇప్పుడు ఆయనతో ఓ సినిమా చేయాల౦టే, ఒకటికి వందసార్లు ఆలోచించుకొంటున్నారట. ఇటీవల ఒక మంచి కథతో మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ వద్దకు శ్రీను వైట్ల వెళ్లగా తాము బిజీగా ఉన్నామని ఇప్పట్లో సినిమా చేయమని మొహం మీద చెప్పేసారు అని సమాచారం.

 

అదేవిధంగా శ్రీను వైట్లతో చేయడానికి ఒకటికి పది సార్లు ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం శ్రీను వైట్ల ఒక కథను రెడీ చేస్తున్నారు. ఆయన ఆ కథను ప్రభాస్ కు వినిపించే ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత శ్రీనువైట్ల కథ విని అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి ఇప్పుడు ఆయనకు ఒక్క హిట్ వస్తే చాలు కెరీర్ గాడిలో పడటం పెద్ద విషయం కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: