ప్రస్తుతం సెలబ్రిటీలంతా కరోనా భయంతో ఇంటికే పరిమిత మవుతున్నారు. ఒకప్పుడు రోజుకు రెండు మూడు కాల్సీట్లు పనిచేసిన స్టార్స్ కూడా ఇప్పుడు ఎలాంటి పని లేకుండా ఖాళీగా ఉన్నారు. దీంతో ఒక్కోక్కరు ఒక్కో రకంగా తమ ఖాళీ సమయాన్ని వినియోగించుకుంటున్నారు. అంతేకాదు ఈ ఫ్రీ టైం ఎక్స్‌ పీరియన్స్‌ను అభిమానులతో షేర్‌ చేసుకుంటున్నారు స్టార్స్‌. తాజాగా టాలీవుడ్‌ టాప్ హీరోయిన్‌ పూజా హెగ్డే కూడా తన అనుభవాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది.

 

ప్రస్తుతం సౌత్‌ లో టాప్‌ హీరోయిన్‌గా వెలుగొందుతున్న భామ పూజా హెగ్డే. తెలుగుతో పాటు బాలీవుడ్‌ లోనూ బిజీ అవుతున్న ఈ భామ, ఇటీవల రోజుకు రెండు షిఫ్ట్‌ల చొప్పున పనిచేస్తోంది. అయితే ఒక్కసారిగా కరోనా ఎఫెక్ట్ తో పూజ కూడా ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె ఇంట్లో తెగ తినేస్తుందట. అందుకే ఈ క్వారెంటైన్‌ పూర్తయ్యేసరికి తాను లావైపోతానేమో అని భయపడుతుంది పూజా హెగ్డే.

 

అదే విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది పూజా. `గైస్‌ నేను ఈ క్వారెంటైన్‌ టైం పూర్తయ్యే సరికి చబ్బీ తయారై బయటకు వస్తానేమో. కానీ ఈ కార్బోహైడ్రేట్స్ వల్ల వచ్చే గ్లో మాత్రం అద్భుతంగా ఉంటుంది` అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా krishna KUMAR' target='_blank' title='రాధా కృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో పాటు అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌ సినిమాల్లో నటిస్తోంది పూజా. వీటితో పాటు మరికొన్ని సినిమాలు ప్రీ ప్రొడక్షన్‌ దశలో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: