ప్రస్తుతం అభిమానులకు అందుబాటులో ఉండడానికి సినీ తారలు సోషల్ మీడియానే ఎంచుకుంటున్నారు. ట్వీటర్, ఇన్ స్టాగ్రామ్ లలో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీలు ఎప్పటికప్పుడుత మ సినిమా విశేషాలతో పాటు ఇతర వివరాలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. మరికొందరు స్టార్స్ అయితే తమ పర్సనల్ విషయాలతో పాటు కొన్ని వీడియోలు, ఫోటోలు కూడా ఎప్పటికప్పుడు అభిమానులకు చూపిస్తూ అలరిస్తున్నారు. అదే సమయంలో సినిమా ప్రమోషన్ విషయంలోనూ సోషల్ మీడియా కీ రోల్ ప్లే చేస్తోంది.
అందుకే నిన్నటి తరం తారలు కూడా సోషల్ మీడియాలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఉగాది సందర్భంగా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ట్విటర్ తో పాటు ఇన్స్టాగ్రామ్లోనూ ఖాతా తెరచిన చిరు, అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశాడు. అదే సమయంలో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అభిమానులకు పలు జాగ్రత్తలను సూచించాడు చిరు.
అయితే చిరు సోషల్ మీడియా ఎంట్రీ ఇవ్వటంతో బాలయ్య అభిమానులు తమ ఫేవరెట్ స్టార్ కూడా సోషల్ మీడియాలోకి రావాలని కోరుతున్నారు. చిరు తరువాత అదే స్థాయి మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ బాలయ్య. కెరీర్ స్టార్టింగ్ నుంచి చిరు, బాలయ్యల మధ్య గట్టి పోటి ఉండేది. దీంతో అభిమానుల్లో కూడా ఆ పోటి ఉండేంది. అందుకే ఇప్పుడు చిరు సోషల్ మీడియా ఎంట్రీ ఇవ్వటంతో బాలయ్య కూడా సోషల్ మీడియాలో సత్తా చాటాలని ఆశిస్తున్నారు ఫ్యాన్స్.
ఇక సినిమాల విషయానికి వస్తే చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక రూలర్ సినిమాతో నిరాశపరిచిన బాలయ్య లాంగ్ గ్యాప్ తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.
#HappySarvariUgadi
— chiranjeevi konidela (@KChiruTweets) March 25, 2020
DELIGHTED to directly engage with my beloved fellow indians,Telugus & my dearest fans through a platform like this.This #NewYear’s Day,let’s resolve to defeat this global health crisis with awareness & responsibility. #UnitedAgainstCorona #StayHomeStaySafe pic.twitter.com/Fb3Cnw4nHH