టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది.   ‘బొమ్మరిల్లు, క్షణం, గూఢచారి, ఎవరు’ వంటి సూపర్ హిట్ చిత్రాల రైటర్‌ అబ్బూరి రవికి మాతృవియోగం కలిగింది. టాలీవుడ్‌లో అతి కొద్ది మంది రచయితలకు మాత్రమే గుర్తింపు ఉంది. అందులో అబ్బూరి రవి ఒకరు. ఆయన తల్లి లలిత (73) బుధవారం సాయంత్రం అనారోగ్యంతో కన్నుమూశారు. వయసు పై బడటం కారణంగా ఆమె గత కొంతకాలంగా అనారోగ్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. దాంతో ఆమెకు బుధవారం గుండెపోటు వచ్చింది.

 

కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఈమెకు.. ఉన్నట్లుండి గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఎప్రిల్ 2 ఉదయం హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు.‌ లలిత గారికి నలుగురు కుమారులు. నలుగురిలో అబ్బూరి రవి చిన్నకొడుకు.  లలిత గారి అంత్యక్రియలు ఫిల్మ్‌ నగర్‌ లోని మహాప్రస్థానంలో నిర్వహించడం జరిగింది. కరోనా ప్రభావం కారణంగా ఆమెను సందర్శించేందుకు ఎవరికి అనుమతి ఇవ్వలేదు.

 

సెలబ్రెటీలు ఎవరు రాకుండానే కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమె అంత్య క్రియలు నిర్వహించారు. పోలీసుల ఆంక్షల మద్య ఆమె అంత్య క్రియలను పూర్తి చేసినట్లుగా కుటుంబ సభ్యులు తెలియజేశారు.   ఇండియాహెరాల్డ్.కామ్ తరఫున లలితగారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ.. వారి  కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. 

మరింత సమాచారం తెలుసుకోండి: