కీర్తి సురేష్... ఈ పేరు గురించి ప్రస్తుతం భారతదేశంలో ఉండే అన్ని సినీ ఇండస్ట్రీలకి ప్రతేక్యంగా చెప్పాలిసిన అవసరం లేదు. దీనికి కారణం ఆమె నటించిన " మహానటి " సినిమా. నాగ్ అశ్విన్ దర్శకత్వంతో వచ్చిన మహానటి సినిమా తన హావభావాలతో అలనాటి నటి మహానటి అయిన సావిత్రిని మన కనులముందు సాక్షాత్కరించింది. ఆమె నటనతో మళ్లీ సావిత్రి సినిమాల్లో నటిస్తుందేమో అన్నంతగా తన నటనతో తెలుగు ప్రేక్షకులకు అనిపించేలా చేసింది.
"నేను శైలజ" చిత్రంతో తెలుగు సినిమా లోకానికి పరిచయమైన అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్. తను నటించిన ఆ సినిమా హిట్ అవ్వడంతో తెలుగులో వరుసగా ఆఫర్స్ అందుకుంటూ తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది ఈ ముద్దుగుమ్మ. నిజానికి కీర్తి ఒక మంచి నటి మాత్రమే కాదు, చూడ చక్కని అందం... ఆకట్టుకునే రూపంతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసుకుంది ఈ సొగసరి. ఇది ఇలా ఉండగా నాగ్ అశ్విన్ దర్శకత్వంతో వచ్చిన "మహానటి" సినిమాకు కీర్తి సురేష్ ఏకంగా "జాతీయ ఉత్తమ నటి" అవార్డు కూడా తనని వరించింది.
అయితే అంత బాగున్నా ప్రస్తుతం కీర్తి పెళ్లి గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది ఇప్పుడు. ఆ విషయం ఏమిటంటే... తన కోసం ఆమె కుటుంబ సభ్యులు ఇప్పటికే ఒక వరుడిని వెతికారని, అతను ప్రముఖ bjp నాయకుడి కుమారుడని ప్రచారం జరుగుతుంది. అంతటితో ఆగకుండా ఏకంగా ఈ సంవత్సరం చివరలో వారిద్దరి వివాహం జరగనున్నట్టు నటుడు ఫూల్ వాన్ రంగనాథన్ ఒక మీడియా సమావేశంలో ఆయన పేర్కొన్నాడు.
కాకపోతే తన పెళ్లిపై వస్తున్న వార్తలను నటి కీర్తి సురేష్ పూర్తిగా ఖండించింది. ఈ విషయం గురించి ఆమెను ప్రశ్నించగా అవన్నీ అవాస్తవాలని, అలాంటి వదంతులు నమ్మవద్దని ఆమె క్లియర్ గా స్పష్టం చేసింది. ఆమె మాట్లాడుతూ.. నిజానికి నేను మరో సంవత్సరం వరకు "నీను చాలా బిజీ.. సినిమాలు చేయాడానికే సమయం లేదు.. ఈ పరిస్థితుల్లో పెళ్లి ఎలా జరుగుతుంది" అని తెలిపింది.