మెగాస్టార్ చిరంజీవి గూర్చి ప్రేత్యేకంగా చెప్పాలిసిన పని లేదు. తెలుగు ఇండస్ట్రీ లో  ఆయనకి తిరుగులేదు. ఇండస్ట్రీ కి ఒక పెద్ద మనిషిలా వ్యవహరిస్తారు. చిరంజీవి ఇంత ఉన్నత స్థాయికి చేరుకోడానికి చాలా కష్టపడ్డారు. నటనలో గాని, డైలాగ్ విషయంలోగాని, డాన్సులో గాని ఆయనకు లేరు పోటీ. మెగా ఫ్యామిలీ లో నుంచే చాలామంది హీరోలు, నిర్మాతలు కూడా ఉన్నారు. దాసరి నారాయణ చనిపోయిన తర్వాత తెలుగు ఇండస్ట్రీ కి పెదరాయుడు పాత్ర చిరంజీవి తీసుకున్నారు. అయన మాటకి తిరుగులేదు ఇప్పుడు.. మెగాస్టార్ కి అభిమానులు కూడా ఎక్కువే. అయన సినిమాకోసం ఎంతగానో ఎదురుచూస్తారు అభిమానులు. 

 


ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమా గూర్చి మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఒకపక్క మెగాస్టార్, మరో పక్క మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు అనే వార్త బయటకు వచ్చింది. ఒకానొక సమయంలో ప్రిన్స్ మహేష్ బాబు కూడా నటిస్తున్నారు అనగానే సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అయితే ఇప్పుడు  ఒక వార్త సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది. మెగా స్టార్ చిరంజీవి పక్కన  నటించే అవకాశం కోసం ఎంతగానో ఎదురుచూస్తారు. అయన ఒక మాట అంటే చాలు తూచా తప్పకుండా పాటిస్తారు. కానీ అలాంటిది హీరోయిన్  త్రిష మాత్రం అందుకు భిన్నంగా ఆచార్య సినిమా నుంచి తప్పుకుంది. త్రిష కూడా ఒకప్పటి హీరోయిన్, అందులోను మెగాస్టార్ తో స్టాలిన్ సినిమాలో నటించింది. అందుకని ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషని తీసుకున్నారు. కానీ త్రిష మాత్రం ఆచార్య ప్రాజెక్ట్ నుంచి చాలా సున్నితంగా, ఎవరిని తప్పు పట్టకుండా తప్పుకుంది.. త్రిష సినిమా నుంచి తప్పుకుందని తెలిసిన మెగా స్టార్ ఊరికే ఎలా ఉంటారు. 

 


ఒకానొక ఇంటర్వ్యూ లో ఊరికే ఎందుకు తప్పుకుంటుంది.. మణిరత్నం సినిమాకి  బల్క్ గా డేట్స్ ఇచ్చింది. అందుకే ఆచార్య సినిమాకి డేట్స్ అడ్జస్ట్ చేయలేక తప్పుకుంది అన్నట్లుగా మాటవిసిరాడు. హీరోయిన్ గా కాజల్ ని తీసుకున్నాము అన్నారు.. కానీ ఇక్కడితే గొడవ  ఆగలేదు త్రిష ఊరికే ఉంటుందా...!" సినిమా యూనిట్ మెంబెర్ ఒకాయన వ్యవహారం నాకు నచ్చలేదు" అందుకే విరమించుకున్న అని ఒక  ప్రకటనలో నోరుజారింది. అయితే యూనిట్ మెంబెర్ అంది కానీ డైరెక్టరా, హీరోనా, నిర్మాత లేక ఇంకా ఎవరా అనేది చెప్పలేదు. కానీ ఇండైరెక్ట్ గా చిరంజీవినే అన్నది అని సోషల్ మీడియా కోడై కూస్తుంది. మెగాస్టార్ ఈ విషయంపై మరి ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: