టాలీవుడ్ లో బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ సినిమాలకు ఏ స్థాయిలో క్రేజ్ పెరిగిందో అందరికి తెలిసిందే ప్రభాస్ సినిమా విడుదల అవుతుంది అంటే చాలు చాలా మంది పనులు మానుకుని చూసే అభిమానులు కూడా మనకు కనపడుతూ ఉంటారు. ఇక ప్రభాస్ కూడా తన ఫాన్స్ కోసం జాగ్రత్తగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న ప్రభాస్ ఈ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 

 

వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది అని దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివర్లో సినిమా  మొదలు పెట్టి వచ్చే ఏడాది సినిమాను విడుదల చేస్తామని అన్నాడు. అయితే ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దానికి కారణం కరోనా వైరస్ అని సమాచారం. కరోనా వైరస్ తో ఈ సినిమాను వాయిదా వేసే సూచనలు ఉన్నాయని ఈ సినిమా వచ్చే ఏడాది మే లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ లో దీని గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి .

 

సినిమా నిర్మాత అశ్విని దత్ కూడా ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని చెప్పినట్టు తెలుస్తుంది. ఈ సినిమాను ఎలా అయినా సరే ఈ ఏడాది మొదలు పెట్టాలి అని చూసినా సరే అది సాధ్యం కాదు కాబట్టి వచ్చే ఏడాది మొదలు పెడతారు అని సమాచారం. ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. అందుకే ఈ సినిమా ఏ విధంగా ఉంటుంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ లో వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: