ప్రస్తుత జనరేషన్ లో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు క్రేజ్ తీసుకొచ్చిన హీరో ఎవరంటే ఠక్కున మెదిలే హీరో అడవి శేష్. తనలో ఉన్న క్రియేటివిటీ థాట్స్ కు పదును పెడుతూ సొంతంగా కథలు రాసుకోవడం అడవి శేష్ కు అలవాటు. ఓ హీరో తానే కథలు రాసుకుంటూ, తెరకెక్కిస్తూ హిట్లు సాధించడం అనేది ఈమధ్య కాలంలో అడవి శేష్ మాత్రమే సాధించిన ఘనతగా చెప్పుకోవాలి. ప్రస్తుత కరోనా సమయంలో ఇంట్లోనే ఉంటూ మరో సస్పెన్స్ థ్రిల్లర్ కథ రాస్తున్నట్టు సమాచారం.

 

 

కమర్షియల్ సినిమాలతో పాటు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చేస్తూంటాడు అడవి శేష్. అయితే సొంతంగా కథలు రాసేది మాత్రం థ్రిల్లర్ పాయింట్స్ మీదే. 2019లో వచ్చిన ఎవరు సినిమాతో హిట్ కొట్టిన శేష్ ఇప్పుడు ఓ కథ రాస్తున్నాడు. 2018 సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన గూఢచారి సినిమాకు సీక్వెల్ కథ రాస్తున్నాడని ఫిలింనగర్ సమాచారం. ఈ కథ దాదాపు పూర్తి కావొచ్చిందని కూడా తెలుస్తోంది. లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఈ కథకు ఇంట్లోనే ఉండి దాదాపు పూర్తి చేశాడని సమాచారం. షూటింగ్స్ ప్రారంభమయ్యాక ఈ సినిమాపై అప్డేట్ వస్తుందని అంటున్నారు.

 

 

అడవి శేష్ చేసిన గూఢచారి సూపర్ హిట్ అయింది. ఈ సినిమా మేకింగ్ కూడా ఓ సంచలనమైంది అప్పట్లో. సినిమా చూస్తు చాలా భారీ ఖర్చుతో తెరకెక్కించినట్టు అనిపిస్తుంది. కానీ.. కేవలం 6కోట్ల బడ్జెట్ తో ఆ సినిమా తెరకెక్కింది. నాగార్జున కూడా ఇంత తక్కువ బడ్జెట్ లో సినిమా ఎలా సాధ్యమైందని ఆశ్చర్యపోయాడు కూడా. మంచి కథ, సస్పెన్స్ థ్రిల్లర్ కంటెంట్, శశి కిరణ్ తిక్కా దర్శకత్వ ప్రతిభతో గూఢచారి సూపర్ హిట్ అయింది. సీక్వెల్ గా రాబోతున్న గూఢచారి ఏమేర హిట్ సాధిస్తుంతో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: