రీచా చద్దా, ఈ భామ గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దగా తెలియకపోవచ్చు కానీ బాలీవుడ్ ఇండస్ట్రీకు మాత్రం పరిచయం అక్కర్లేని హీరోయిన్. అక్కడ 2008వ సంవత్సరంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఆమె ప్రవేశించింది. ఈ 33 ఏళ్ల సుందరి డిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ నుంచి సోషల్ కమ్యూనికేషన్ మీడియాలో డిప్లమా పూర్తి చేసి ఆ తర్వాత మోడల్ కావాలని నిర్ణయించుకుని మోడలింగ్ లోకి అడుగుపెట్టింది. అక్కడ థియేటర్ ఆర్ట్స్ వైపు మళ్ళింది. ఆ తదుపరి "ఓయ్ లక్కీ... లక్కీ ఓయ్... " సినిమాలో సహాయ నటిగా 2008 సంవత్సరంలో తన కెరీర్ ని బాలీవుడ్ లో ప్రారంభించింది. అయితే ఆ తర్వాత కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కొనసాగింది.

 


ఒకవైపు సహాయ నటిగా నటిస్తూనే తనకు ఇష్టమైన మోడలింగ్ ను మాత్రం వదులుకోలేదు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ రూపొందించిన గ్యాంగ్స్ ఆఫ్ వన్సేపుర్ సినిమాతో మంచి బ్రేక్ వచ్చింది. ఈ సినిమాలో ఆమె నటించిన నటనకు గాను అవకాశాల ఆమె వెంట తలుపు తట్టాయి. ఇక ఆ తర్వాత 'ఫుక్రే' , రామ్ లీల, మసాన్, సన్నీలియోన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సరబ్జిత్, సెక్షన్ 375 , బంగా సినిమాలు మంచి పేరు తీసుకువచ్చాయి. అయితే ఈమె నటనలో ఎక్కువగా బోల్డ్ నెస్ కనిపిస్తుంటుంది.

 


అయితే ఇటీవలి కాలంలో మల్లు బ్యూటీ షకీలా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రధాన పాత్ర ఎంచుకొని వార్తల్లో సంచలనం సృష్టించింది. అయితే ఈ భామ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది. సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫొటోస్ ని అప్లోడ్ చేస్తూ అభిమానుల వేడి పుట్టించడంలో రీచా సిద్ధహస్తురాలు. అయితే తాజాగా ఎప్పటికప్పుడు తన ఫోటోని షేర్ చేసిన రిచా స్విమ్మింగ్ పూల్ వద్ద ఉన్న ఫోటో ను అప్లోడ్ చేసింది ఈ ఫొటోస్ లో అమ్మడి అందాలు కుర్రకారు మతి పోగడుతున్నాయి. లాక్ డౌన్లో లో ఇలా ఆమె అందాలను విందుగా వడ్డిస్తున్న ఫ్యాన్స్ ఆమెకు థాంక్స్ అని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: