జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి చిత్రంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించడం ఇదే మొదటిసారి కాగా... ఈ సమయంలోనే వారిద్దరి మధ్య స్నేహం బాగా చిగురిస్తుంది. వాళ్లిద్దరూ కలిసి కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. 


అంతకు ముందు జూ. ఎన్టీఆర్ 'అల వైకుంఠపురములో' సినిమా గురించి ట్వీట్ చేస్తూ... 'అలవోకగా అద్భుతంగా నటించిన అల్లు అర్జున్ కు, బ్రిలియంట్ గా కథ రాసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కి నా అభినందనలు. మీ ఇద్దరి కాంబినేషన్ వల్ల 'అల వైకుంఠపురములో' గొప్ప సినిమా అయ్యింది. కంగ్రాట్స్ అల్లు అర్జున్ బావా, త్రివిక్రమ్ స్వామి', అని చెప్పాడు. బావా అని పిలిచేసరికి షాక్ అయిన బన్నీ థాంక్స్ అంటూ చెప్పాడు. మెగా అభిమానులు కూడా ఎన్టీఆర్ కి ధన్యవాదములు తెలిపారు. ఐతే మళ్ళీ తాజాగా మెగా ఫ్యామిలీ లోని చిరంజీవి ని తన ట్వీట్ లో మెన్షన్ చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు జూ. ఎన్టీఆర్. 


పూర్తి వివరాలు తెలుసుకుంటే... లాక్ డౌన్ కారణంగా సినీ చిత్రీకరణలు అన్నీ ఆగిపోగా రాజమౌళి ఇంట్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన తన ఇంట్లో పనులన్నీ చేసి... "బి ద రియల్ మ్యాన్'' అంటూ ఒక వీడియో ఛాలెంజ్ ని జూ. ఎన్టీఆర్ కు విసిరారు. దాంతో జక్కన్న ఛాలెంజ్ ను స్వీకరించిన తారక్ కూడా తన ఇంట్లో పనులు చేసి ఆ వీడియో ని ట్విట్టర్ లో షేర్ చేసి...' మీరిచ్చిన ఛాలెంజ్ పూర్తిచేసాను, జక్కన్న. 
మన ఇంట్లో ప్రేమలు ఆప్యాయతలే కాదు. పనులను కూడా పంచుకుందాం. పని భారాన్ని పంచుకున్నప్పుడు చాలా సరదాగా ఉంటుంది. ఈ ఛాలెంజ్ ని బాలా బాబాయి, నాగార్జున బాబాయి, వెంకటేష్ గారు, చిరంజీవి, శివకోరటాల గారు టేక్ అప్ చేయాలని నేను కోరుతున్నాను' అని పేర్కొన్నాడు. 


ఇవన్నీ చూస్తుంటే మెగా ఫ్యామిలీ కి జూ. ఎన్టీఆర్ దగ్గరవుతున్నాడని... ఫలితంగా మెగా అభిమానులకు ప్రీతిపాత్రుడవుతున్నాడని తెలుస్తుంది. ఏది ఏమైనా మెగా అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను ఆదరించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని తెలుస్తోంది. ఇదే గనుక జరిగితే జూనియర్ ఎన్టీఆర్ కు మరింత ప్లస్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: