నటి, బీజేపీ మహిళానేత మాధవీలత కొన్ని రోజుల క్రితం సాధినేని యామినిని ఉద్దేశిస్తూ ఫేస్ బుక్ లో వివాదాస్పద పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. పార్టీని తిట్టిన వారికే పదవులు ఇస్తారని... పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు లేదని మాధవీలత పోస్ట్ చేసింది. ఈ వ్యవహారంపై సాధినేని యామిని ఇప్పటివరకు స్పందించలేదు. సాధినేని యామినికి బీజేపీ అధికార ప్రతినిధి పోస్ట్ దక్కడంతో మాధవీలత ఆమెపై ఓ రేంజ్ లో ఫైర్ అయింది. 
 
అయితే తాజాగా వివాదాస్పద నటి శ్రీరెడ్డి రంగంలోకి దిగి మాధవీలతకు షాక్ ఇచ్చింది. సాధినేని యామిని జోలికి వస్తే తాట తీస్తా.. నీ బండారం బయటపెడతా అంటూ ఫేస్ బుక్ లో శ్రీరెడ్డి పోస్ట్ చేసింది. తాను సాధినేని యామినికే సపోర్ట్ చేస్తానని... ఆమె గురించి ఎవరైనా పిచ్చవాగుడు వాగితే తాట తీస్తా.. వారి చరిత్ర అంతా బయటకు తీస్తా అంటూ పోస్ట్ చేసింది. మీకులం వాళ్లకు ప్రేమ లేఖలు, మిగతావాళ్లను చూస్తూ ఏడుపు అంటూ శ్రీరెడ్డి కులం ప్రస్తావన తీసుకొచ్చింది. 
 
నువ్వు లక్ష సార్లు మల్లెపూలు పిసికావు... మరిచిపోయావా...? అంటూ పోస్ట్ చేసింది. గతంలో క్యాస్టింగ్ కౌచ్ విషయంలో మాధవీలత శ్రీరెడ్డిపై కామెంట్స్ చేయడంతో... శ్రీరెడ్డి సాధినేని యామినికి సపోర్ట్ ఇస్తూ మాధవీలతను టార్గెట్ చేసింది. శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ గురించి మాధవీలత ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. మాధవీలత చేసిన పోస్ట్ పై బీజేపీ నేతలు కూడా సీరియస్ అయ్యారని తెలుస్తోంది. 
 
బీజేపీని తిట్టి పార్టీలో చేరితే గుర్తింపు ఉంటుందంటూ ఆమె వ్యాఖ్యలు చేయడం పట్ల ఆ పార్టీ నేతలు సీరియస్ అయ్యారని సమాచారం. మరోవైపు ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన నేతలు కావడంతో సాధినేని యామిని ఈ వ్యవహారంలో సైలెంట్ అయినట్లు తెలుస్తోంది. బీజేపీ పార్టీ కోసం ఎంతో కష్టపడినా గుర్తింపు దక్కకపోవడం... కొత్తగా పార్టీలో చేరినవారికి పదవులు ఇస్తూ ఉండటంతో మాధవీలత ఫేస్ బుక్ ద్వారా తన అవేదనను వెళ్లగక్కింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: