బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ తో సినిమా చేయడానికి ఎందరో దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. టాలీవుడ్ దర్శకులు కొందరు ఆయన తో సినిమా చేయడానికి గానూ ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ కథలను సిద్దం చేస్తున్నారు. ఆయన మాత్రం చాలా జాగ్రత్తగా సినిమాలను చేస్తున్నాడు. కథ ఎంపిక నుంచి ప్రతీ ఒక్కటి కూడా జాగ్రత్త పడుతున్నాడు. సాహో సినిమా తర్వాత ప్రబాస్ సినిమాల మీద నిర్మాతలకు కాస్త నమ్మకం పెరిగింది. సినిమా ఫ్లాప్ అయినా సరే నిర్మాతకు మాత్రం భారీగా లాభాలు వచ్చాయి. 

 

ఆ సినిమాను బాలీవుడ్ జనం కూడా ఎక్కువగానే ఆదరించారు అనేది వాస్తవం. ఆ సినిమా తర్వాత ప్రభాస్ చేసే సినిమాల మీద బాలీవుడ్ దర్శకులు కూడా ఒక కన్నేసి ఉంచారు. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ప్రభాస్ భారీగా రేటు పెంచాడు అనేది బాలీవుడ్ సహా టాలీవుడ్ లో వినపడుతున్న మాట. బాలీవుడ్ దర్శకులు  ఒకరు ప్రభాస్ తో సినిమా చేయడానికి రాగా ఆయన పారితోషికం విషయంలో ప్రభాస్ చెప్పిన మాట విని షాక్ అయ్యారట. దాదాపు 70 కోట్ల వరకు ప్రభాస్ అడిగినట్టు సమాచారం. 

 

సినిమా విడుదలకు ముందు జరిగే మార్కెట్ నుంచి ప్రతీ ఒక్కటి షేర్ అడిగినట్టు సమాచారం. దీనితో సదరు నిర్మాత గారు భయపడ్డారని అంటున్నారు. బాలీవుడ్ లో సినిమా చెయ్యాలి అంటే ఈ స్తాయిలో చెప్పాడట. ఇక ఇప్పుడు అతని తో తెలుగులో సినిమాలు చేయడానికి కూడా ఇక్కడి దర్శకులు భయపడే పరిస్థితి వచ్చింది. కథ తీసుకుని వెళ్తే ఎంత అడిగే అవకాశం ఉంటుందో కొందరు కనీసం అంచనా కూడా వేయలేని పరిస్థితి లో ఉన్నారట ప్రస్తుతం. ప్రభాస్ చేస్తున్న సినిమాలకు డిమాండ్ ఉండటం తోనే ఆయన ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాడు అనేది టాలీవుడ్ టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: