టాలీవుడ్ లో ఇప్పుడు సినిమాలకు మంచి ఆదరణ ఉంది. అందులో ప్రధానంగా చెప్పుకునేది దర్శక ధీరుడు రాజమౌళి సినిమాల గురించి. ఆయన సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తారు అనేది వాస్తవం. కథ ఎలా ఉంటుంది అనే దాని మీద రెండు మూడు నెలల ముందు నుంచే చర్చలు సినిమా విడుదల అయ్యే వరకు కూడా ఉంటాయి.  ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ అనే సినిమాను రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి చేస్తున్నాడు త్రివిక్రమ్. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. 

 

ఇక ఈ సినిమా తర్వాత ఏ సినిమా చేస్తాడు అనుకుంటున్నా తరుణంలో తాను మహేష్ బాబు తో ఒక సినిమా చేస్తున్నా అని కీలక ప్రకటన చేసాడు ఆయన. దీనితో ఈ సినిమా గురించి ఇప్పుడు ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి.. ముందు నుంచి ఈ సినిమా రావాలని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. బాహుబలి సినిమా తర్వాతే ఈ సినిమా రావాల్సి ఉంది. ఇప్పుడు ఈ సినిమా కథను పూర్తిగా మారుస్తున్నాడని అంటున్నారు. తన తండ్రి ఒక కథ ఇచ్చారట. ఇప్పుడు కరోనా కారణంగా ఇంటికి మాత్రమే పరిమితం అయిన ఈ దర్శకుడు, 

 

కథలో భారీగా మార్పులు చెయ్యాలని భావిస్తున్నాడు. మహేష్ ని ఏ స్థాయిలో చూపిస్తే బాగుంటుంది అనే దాని కంటే ఏ కోణంలో చూపిస్తే ప్రేక్షకులకు ఆయన కొత్తగా కనపడే అవకాశం ఉంటుంది అనే దాని మీద ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. చిన్న చిన్న జాగ్రత్తలు కూడా ప్రత్యేకంగా తీసుకుని కథను ముందుకి తీసుకుని వెళ్తున్నారట ఆయన. మరి ఈ  సినిమాలో మహేష్ ని ఏ విధంగా చూపిస్తారు అనేది చూడాలి. ఈ సినిమా కోసం మహేష్ కూడా కష్టపడుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: