యాంకర్ అనసూయ... అనసూయ భరద్వాజ్ గా మారిన రోజు నుండి ఆమెపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జబర్దస్త్ కార్యక్రమం లో వ్యాఖ్యాతగా బాధ్యతలు చేపట్టిన అనసూయ పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుంటూ తెలుగు ప్రేక్షకులకు ఝలక్ ఇచ్చింది. మొదటిలో సాక్షి టీవీ లో న్యూస్ యాంకర్ గా పనిచేసిన అనసూయ ఆ తరువాత 2013వ సంవత్సరంలో జబర్దస్త్ షో కి యాంకర్ గా బాధ్యతలు చేపట్టింది. ఒక వైపు జబర్దస్త్ ప్రోగ్రాం లో వ్యాఖ్యాతగా చేస్తూనే మరోవైపు అడపాదడపా సినిమాల్లో నటించి తనలో నటన నైపుణ్యం ఉంది అని తెలియజేసింది.


రెండు మూడేళ్ల తర్వాత సుశాంక్ భరద్వాజ్ అనే ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని పెళ్ళాడి ఇద్దరు కుమారులకు జన్మనిచ్చింది. ఐతే పెళ్లయి ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత కూడా ఆమె తన డ్రెస్సింగ్ స్టైల్ గానీ, బాడీ లాంగ్వేజ్ కానీ ఏ మాత్రం చేంజ్ చేయలేదు. వాస్తవానికి పెళ్లికాకముందుకే తాను కాస్త సాంప్రదాయంగా ఉందని నెటిజనులు కామెంట్లు చేస్తుండడం గమనార్హం. జీ తెలుగులో ప్రసారం అవుతున్న కార్యక్రమంలో అనసూయ శేఖర్ మాస్టర్ తో కలిసి చేసే డ్యాన్సులను చూస్తే ఎవరికైనా కాస్త వెగటుగానే అనిపిస్తుంది. ఎంత డబ్బు పిచ్చి కాకపోతే మాత్రం పెళ్లయిన తర్వాత కూడా ఇలా వేరే వ్యక్తి తో శృంగారభరిత నృత్యాలు చేయడం అస్సలు బాగోలేదని ఎంతోమంది ఇప్పటికీ ఆమెకు చివాట్లు పెడుతూనే ఉంటారు. ప్రతిరోజు సామాజిక మాధ్యమాలలో ఆమెను ఆంటీ ఆంటీ అంటూ ఆమె పెళ్లి చేసుకోవడమే పెద్ద తప్పు గా ట్రోల్ చేస్తూనే ఉంటారు. అయినా వాళ్లందరికీ ఘాటుగా సమాధానాలు ఇస్తూ ఉంటుంది అనసూయ.


తాజాగా సోషల్ మీడియా లైవ్ లో చిట్ చాట్ చేసిన అనసూయ పెళ్లి గురించి ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఓ యువతి పెళ్లి చేసుకుంటే అది ఆమెకు ఒక వరంగా మారాలే తప్ప శాపంగా మారకూడదని చెప్పుకొచ్చింది. పెళ్లయిన తర్వాత కూడా ప్రతి మహిళ జీవితంలో స్వాతంత్రం, స్వేచ్చ ఉండాలని... వారు ఎప్పటిలాగానే కలలు కనాలని వాటిని సాధించుకునేందుకు ప్రయత్నించాలని ఆమె అన్నారు. పెళ్లి అయితే కేవలం ఒకరి పార్ట్నర్ అవుతాముు తప్ప వారి బానిసలము, పని మనుషులను కాము.... పిల్లల్ని కనే యంత్రాలు అసలే కాము. పెళ్లి ప్రతి ఒక్కరి జీవితాన్ని ఉన్నతంగా మార్చాలని ఆమె చెప్పుకొచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: